• Home » Assembly elections

Assembly elections

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా కూటమిలోనే బీజేపీ ఉంది

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా కూటమిలోనే బీజేపీ ఉంది

‘మా కూటమిలోనే బీజేపీ ఉంది, అదే సమయంలో బీజేపీతో పలు ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల తర్వాత కూటమిపై స్పష్టత వస్తుంది. ఎన్నికలకు మరో 8 నెలలు మాత్రమే ఉన్నందున ఆలోగా మరిన్ని పార్టీలు మా కూటమిలోకి వస్తాయని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) పేర్కొన్నారు.

Prashant Kishore: జన్‌ సురాజ్ ఓట్లు చీల్చే పార్టీ.. కానీ ట్విస్ట్ ఉంటుంది

Prashant Kishore: జన్‌ సురాజ్ ఓట్లు చీల్చే పార్టీ.. కానీ ట్విస్ట్ ఉంటుంది

రెండో దెబ్బ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూపై పడుతుందని, జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు పెద్ద సంఖ్యలో జన్ సురాజ్‌ వైపు మళ్లుతున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. జన్ సురాజ్ ఊపు ఇదేవిధంగా కొనసాగితే మూడో దెబ్బ బీజేపీపై పడుతుందని అన్నారు.

EPS: మాజీ సీఎం ఈపీఎస్‌ సరికొత్త పంథా..

EPS: మాజీ సీఎం ఈపీఎస్‌ సరికొత్త పంథా..

రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ‘దోపిడీలు-దొంగలు’, ‘సత్యం కోసం-స్వేచ్ఛ కోసం’అనే కొత్త ప్రచార పథకానికి శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రప్రజలకు ఇచ్చిన హామీల్లో డీఎంకే ప్రభుత్వం 99 శాతం నెరవేర్చకుండా ప్రజలకు మొండి చెయ్యి చూపించిందన్న పదాలతో కూడిన లోగోను ఆయన ఆవిష్కరించారు.

Dy CM Udayanidhi: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో కాషాయానికి నో ఎంట్రీ

Dy CM Udayanidhi: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో కాషాయానికి నో ఎంట్రీ

రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన బూత్‌కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

BJP Thamilisai: విజయం తర్వాతే.. సంకీర్ణ ప్రభుత్వంపై నిర్ణయం

BJP Thamilisai: విజయం తర్వాతే.. సంకీర్ణ ప్రభుత్వంపై నిర్ణయం

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వంపై అమిత్‌ షా, ఎడప్పాడి పళనిస్వామి కలిసి నిర్ణయం తీసుకుంటారని బీజేపీ సీనియర్‌ నేత తమిళిసై సౌందర్‌రాజన్‌ తెలిపారు. స్థానికంగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం వచ్చిన తమిళిసై మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ నిధులు వెచ్చించి‘ఉంగళుడన్‌ స్టాలిన్‌’ పేరుతో డీఎంకే ఎన్నికల ప్రచారం చేపట్టిందని ఆరోపించారు.

EPS: బై.. బై.. స్టాలిన్‌.. మిమ్మల్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారు

EPS: బై.. బై.. స్టాలిన్‌.. మిమ్మల్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారు

రాష్ట్రంలో గత నాలుగేళ్ళకు పైగా కొనసాగుతున్న ప్రజావ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని మరో 9 నెలల్లో ప్రజలే ఇంటికి సాగనంపుతారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ఈ నెల 7వ తేదీన ప్రారంభించిన తొలి ప్రచారయాత్ర బుధవారం తంజావూరు జిల్లా వరత్తనాడులో ముగిసింది.

 Bihar: పాపులర్ సీఎం ఫేస్ తేజస్వి, వెనుకబడిన నితీష్.. సర్వే వెల్లడి

Bihar: పాపులర్ సీఎం ఫేస్ తేజస్వి, వెనుకబడిన నితీష్.. సర్వే వెల్లడి

యువకుల్లో తేజస్వికి మంచి పాపులారిటీ ఉన్నట్టు సర్వే తెలిపింది. ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 25-34 సంవత్సరాల మధ్య ఉన్న 40 శాతం మంది యువకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 22 మంది నితీష్ వైపు మొగ్గుచూపారు.

Nishant Kumar: మళ్లీ మా నాన్నే సీఎం

Nishant Kumar: మళ్లీ మా నాన్నే సీఎం

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా సేవలందించిన 75 ఏళ్ల నితీష్ కుమార్ మరోసారి అధికారాన్ని ఆశిస్తున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ భాగస్వామిగా ఉన్నాయి.

EPS: ఎన్నికల్లో మా వ్యూహాలు బయటకు చెప్పలేం..

EPS: ఎన్నికల్లో మా వ్యూహాలు బయటకు చెప్పలేం..

డీఎంకేను ఓడించాలనుకునే పార్టీలన్నీ ఏకేతాటిపైకి రావాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పిలుపునిచ్చారు. విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తుపై మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహాలు ఇప్పుడే బయటకు చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. పళనిస్వామి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

Speaker Appau: మైనారిటీ ఓట్లు చీల్చేందుకే విజయ్‌కి బీజేపీ పరోక్ష మద్దతు..

Speaker Appau: మైనారిటీ ఓట్లు చీల్చేందుకే విజయ్‌కి బీజేపీ పరోక్ష మద్దతు..

అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను చీల్చేందుకే కేంద్రంలోని బీజేపీ పాలకులు తమిళగవెట్రి కళగంకు మద్దతునిస్తున్నారని, ఆ పార్టీ నాయకుడు విజయ్‌ తల్లి క్రైస్తవురాలు కావడంతో, ఆ ఓట్లను చీల్చవచ్చునని కలలు కంటున్నారని స్పీకర్‌ అప్పావు విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి