Home » Assembly elections
అన్నాడీఎంకే ప్రచారసభలోకి ఖాళీ అంబులెన్స్ రావడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మక్కలై కాప్పోం-తమిళగత్తై మీడ్పోం’ నినాదంతో గత నెల 7న ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్రలో భాగం గా సోమవారం రాత్రి వేలూరు సమీపంలోని అనైకట్టు ప్రాంతంలో ఈపీఎస్ రోడ్షో నిర్వహించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్(Vijay) ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో కలిసిపోయి, వారితో మమేకమైన పార్టీగా వచ్చే ఎన్నికల్లో నిరూపించబోతున్నట్టు విజయ్ వెల్లడించారు.
రాష్ట్రంలో గట్టిగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్ష, బలమైన మిత్రపక్షాలు జతకట్టపోవడం, కూటమిలో బోలెడన్ని స్థానాలున్న నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో అధిక స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి 50 చోట్ల పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది.
తమ పార్టీలో పదవులు అనుభవించి, అవసరం తీరాక డీఎంకేలో చేరేవారంతా వలసపక్షులేనని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’అనే నినాదంతో గత నెల 7వ తేదీ కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభిమైన ఈపీఎస్ ప్రచారయాత్ర బుధవారం తిరుపత్తూరుకు చేరుకుంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్ వెలువడక ముందే ఓటర్ల జాబితాను ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా సవరించాలే తప్ప, బిహార్ తరహా సవరణ చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం డిమాండ్ చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంచర్ల అశోక్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ నోరు తిరగని పేర్లతో కొత్త పథకాలను ప్రారంభిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధ్వజమెత్తారు.
పదేళ్ల అన్నాడీఎంకే పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అథఃపాతాళానికి చేరిందని, గత నాలుగేళ్ల డీఎంకే ద్రావిడ తరహా పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పురోగమించినట్లు కేంద్రప్రభుత్వమే ప్రకటించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
‘సినీ, రాజకీయ రంగాల్లో రికార్డులు సాధించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన రోల్ మోడల్’ అని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత పేర్కొన్నారు. జీసీసీ ప్రధాన కార్యాలయం రిప్పన్ భవనం సమీపంలో తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మద్దతు ప్రకటించిన ప్రేమలత, సోమవారం వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి తమకు బాగా తెలుసని అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎద్దేవా చేశారు. డీఎంకే పాలనలో అన్ని రంగాల్లో కుంటుపడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు.