Home » Asia Cup
టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత్ గుడ్ న్యూస్ వచ్చింది. గాయం కారణంతో విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్కు చాలా ముందుగానే తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
శనివారం నాడు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. ఐసీసీ సమావేశానికి పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా హాజరయ్యారని, అజెండాలో లేనప్పటికీ తాను, నఖ్వీ.. ఐసీసీ అధికారుల సమక్షంలో భేటీ అయ్యామని సైకియా అన్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం బాగుందని, ఇరు పక్షాలూ ఈ సమావేశంలో సహృదయంతో పాల్గొన్నాయని తెలిపారు.
నవంబర్ 4న ఐసీసీ త్రైమాసిక సమావేశం జరగనుంది. ఈలోగా నఖ్వీ.. ఆ ట్రోఫీని భారత్కు అప్పగించాలని, లేకపోతే ఈ విషయాన్ని ఐసీసీ (ICC) దృష్టికి తీసుకువెళతామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా హెచ్చరించారు. దాదాపు నెల గడుస్తున్నా.. ఇప్పటికీ ఆసియా ట్రోఫీని భారత్ కు అందించలేదని సైకియా ఓ న్యూస్ ఏజెన్సీతో అన్నారు.
ఆసియా కప్ గెలిచినా కూడా ట్రోఫీ భారత్ చేతికి దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ట్రోఫీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. వచ్చే నెలలో ఏసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు భారత్, పాక్, ఇతర సభ్య దేశాలు హాజరుకానున్నాయి. కానీ ఈ మీటింగ్కు పీసీబీ చీఫ్ ముఖం చాటేస్తే ప్రతిష్టంభన మరింత కాలం పాటు కొనసాగొచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ చాలా వాడివేడిగా సాగింది. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీ తీసుకోలేకపోయింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు ట్రోఫీ దక్కకూడదని నఖ్వీ దానిని తనతో పాటు తీసుకుపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆసియా కప్ ట్రోఫీ తీసుకెళ్లిపోయిన మోహసీన్ నఖ్వీ చర్యలపై బీసీసీఐ సెక్రెటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చర్యలు అనైతికమని అన్నారు.
ఆసియా కప్ ఫైనల్స్లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్పై అభిమానులు మండిపడుతున్నారు. పులితో పెట్టుకుని పాక్ దెబ్బైపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఓ రేంజ్లో ట్రోలింగ్కు దిగుతున్నారు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన అభిషేక్ శర్మ హావెల్ హెచ్9 కారును బహుమతిగా అందుకున్నారు. మరి ఈ ఎస్యూవీ ప్రత్యేకతలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తాజా ఆసియా కప్లో రింకూ సింగ్ ఒకే ఒక బాల్ ఆడాడు. కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆదివారం పాకిస్థాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన రింకూ బౌండరీ బాది టీమిండియాకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.