Home » AP Police
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు (శుక్రవారం) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పూడి శ్రీహరి, గిరీశ్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శుభకార్యం కాస్తా భయాందోళనల మధ్య ముగిసింది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఎంతో ఉత్సాహంగా ఉన్న పెళ్లికొడుకుపై ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోతున్న వారికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని గ్రూప్లు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
బెట్టింగ్,జూద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఏపీలో ఆన్లైన్ గేమింగ్ పేరిట జరుగుతున్న బెట్టింగ్, జూద కార్యకలాపాలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 'డ్రగ్స్ పై దండయాత్ర-2' కార్యక్రమంలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి బంగారు నగలు దోచుకునే మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిని తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తనతో పాటు ఓ పసిబిడ్డను ఓ మహిళ తీసుకుని వచ్చి పబ్లిక్ టాయిలెట్లో వదిలి వెళ్లడం అందరినీ కలిచివేస్తోంది.
చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అంటే ఒక గౌరవమని ఉద్ఘాటించారు.