Home » AP Police
మూడు తరాల నాయకులతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పని చేశారని హోం మంత్రి అనిత గుర్తు చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ను వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైల్లో పెట్టి వేధించిందని తెలిపారు.
ఏలూరు జిల్లాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బి.సుబ్బారావు అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి వద్ద ఎర్రకాల్వలో అతని మృతదేహం లభ్యమైంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆటో డ్రైవర్ అశోక్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ హేమంత్కు మధ్య పాత కక్షలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
సాధారణంగా వినాయక చవితి నుంచి వినాయక ఉత్సవాలు నెల రోజులపాటు ఉంటాయి. కొంతమంది ఒకరోజు, కొంతమంది మూడు రోజులు, కొంతమంది ఐదు రోజులు, కొంతమంది 9 రోజులు, కొంతమంది 15 రోజులు తరువాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. పునీత్ కంపెనీలో సైబర్ మోసానికి పాల్పడ్డారు. పునీత్ పేరుతో తన అకౌంటెంట్కు సైబర్ కేటుగాళ్ల మెసేజ్ చేశారు. అత్యవసరంగా రూ.1.40 కోట్లు కావాలంటూ.. అకౌంట్కు డబ్బులు పంపుమని మెసేజ్ పంపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని చేసిన నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలను నూజివీడు డీఎస్పీ ఖండించారు. పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామ కొల్లేరు ప్రాంత రైతాంగ పోరాటంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం మారణయుధాలతో కొంతమంది రౌడీ షీటర్లు, బౌన్సర్లను తన ఇంటి వద్ద వైసీపీ నాయకుడు అబ్బాయి చౌదరి ఏర్పాటు చేశారు.
వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి కీలకంగా ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు. ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో నారాయణ స్వామి సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేసినట్లు తెలుస్తోంది.
ఏపీ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సిట్ అధికారులు నిందితులకు నిద్రలేకుండా చేస్తున్నారు. సిట్ దూకుడుతో కేసు జెట్ స్పీడ్లో ముందుకెళ్తుంది. తాజాగా కేసులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. ఆయనను విచారించి నిజానిజాలు రాబట్టానున్నట్లు అధికారులు తెలిపారు.
కదిరి నుంచి జిల్లా సరిహద్దుగా ఉన్న తనకల్లు మండలంలోని చీకటిమానుపల్లి వరకు అనేక మలుపులున్నాయి. ఈమలుపుల్లో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడంలేదు. ముఖ్యంగా నల్లచెరువు మండలంలోని పెద్దయల్లంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు పూర్తిగా కనిపించవు.