Home » AP Govt
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడోరోజు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పెందుర్తి నియోజకవర్గంలో మినీ జెట్టి నిర్మాణంపై పంచకర్ల రమేశ్ బాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు.
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి రాంబాబు అవమానించారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆయనని వదలి పెడతామా? అని ప్రశ్నించారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఐదేళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారాయన. తనలాంటి వాళ్లు ఎంతోమంది కనీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.
వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారాయన.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. కల్తీ మద్యంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి.
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదికలో ప్రస్తావించింది. 2022-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ నివేదికలో వెల్లడించింది.
ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు.
ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై నేడు ధన్యవాదాల తీర్మానం, చర్చ నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ చర్చను ప్రారంభించనున్నారు.
హిందూ మతాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు.