Home » AP Govt
ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు.
ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడమే కాకుండా, పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మాజీ సీఎం జగన్పై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు లేవని, కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు.
ఉగాది పర్వదినాన రాష్ట్ర యువతకు తమ కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ప్రస్తావించారు.
ఏపీలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(గురువారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
జాబ్ క్యాలెండర్ విడుదల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తాజా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం.. విద్య, పోలీస్ శాఖలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి అన్నారు.
దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా.. ఆత్మస్థైర్యంతో వారు పనిచేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన సుమారు 50,000 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిస్తూ దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన బిల్లుల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
విశాఖపట్నం రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. వైజాగ్లోని ముడసర్లోవ వద్ద 52.2 ఎకరాల భూమిని ఆగస్టు 2024లో రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించిందని ప్రస్తావించారు.