Home » Annamayya
ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పీలేరు త్వరలో మున్సిపాలిటీగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న పీలేరును అభివృద్ధి పథంలో నిలపాలంటే మున్సిపాలిటీగా చేయక తప్పదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్కుమార్రెడ్డి ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
సిద్ధం.. సిద్ధం.. అని ఎగిరెగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపైనా, వివేకా హత్య, గులకరాయి డ్రామాపైనా చర్చకు మీరు సిద్ధమా అని బోయినపల్లి ప్రజావేదిక సభలో వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు.
సమాజంలో ప్లాస్టిక్ను రూపుమాపి, ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. శనివారం‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్’ను అట్టహాసంగా నిర్వహించారు. పలుప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రంగా తయారు చేశారు. అనంతరం చెత్త నిర్వహణను కట్టుదిట్టంగా నిర్వహించి పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ బూనారు.
యువపోరు పేరుతో జగన్రెడ్డి దొంగాట ఆడుతున్నాడని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ
దేశంలో పొడవైన రహదారిగా గుర్తింపు పొందిన ముంబై - చెన్నై జాతీయ రహదారిపై ములకలచెరువు కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. మూడేళ్లగా రాత్రిళ్లు భయం...భయం, ములకలచెరువు కనపడదు. అసలు ఇది జాతీయ రహదారేనా, ఇక్కడ అసలు ఊరు ఉందా అనే అనుమానం నెలకొంటోంది.
భక్తులు వైకుంఠ ఏకాదశి వేడుక లను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. స్వామివారిని వైకుంఠ ద్వారదర్శనం చే సుకొని పునీతులయ్యారు.
సోషల్ మీడియా ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్య మాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ విద్యాసాగర్నాయుడు హెచ్చరించారు.
తెలు గుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రం లోని నాయీ బ్రాహ్మణు లకు రాజ కీయ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత దక్కిందని ఆ సంఘం కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు.
పట్టణంలోని జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న బీఎల్డబ్ల్యూ క్వార్టర్స్ స్థలంలో అక్రమంగా రేకు బంకులను ఏర్పాటు చేస్తుండడంతో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తిరుమల(Tirumala) మాడవీధుల విస్తరణలో భాగంగా కూల్చివేసిన అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలని, లేనిపక్షంలో ఫిబ్రవరి 22న ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని మంగళం అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి స్పష్టం చేశారు.