Home » Annamayya
అన్నమయ్య జిల్లా స్థూల ఉత్పత్తిలో రెండేళ్లుగా నిలకడగా ఉంది. అదే సమయంలో తలసరి ఆదాయం గత ఏడాదితో పోల్చితే దిగజారింది.
అన్నమయ్య జిల్లాలో జలధార పథకంతో సాధించిన ప్రగతిని కేంద్రం దృష్టికి కలెక్టర్ నిశాంత్కుమార్ తీసుకెళ్లారు. జలవనరుల శాఖ, ఉపాధిహామీ పథకాలతో చేపట్టిన పనుల వివరాలతో నివేదికను పంపించారు.
భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె. 114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. వాగ్గేయకారుడు అన్నమయ్య పేరుతో ఏర్పడిన జిల్లాకు కొత్త కేంద్రంగా గురువారం నుంచి పాలన మొదలైంది.
ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పీలేరు త్వరలో మున్సిపాలిటీగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న పీలేరును అభివృద్ధి పథంలో నిలపాలంటే మున్సిపాలిటీగా చేయక తప్పదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్కుమార్రెడ్డి ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
సిద్ధం.. సిద్ధం.. అని ఎగిరెగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపైనా, వివేకా హత్య, గులకరాయి డ్రామాపైనా చర్చకు మీరు సిద్ధమా అని బోయినపల్లి ప్రజావేదిక సభలో వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు.
సమాజంలో ప్లాస్టిక్ను రూపుమాపి, ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. శనివారం‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్’ను అట్టహాసంగా నిర్వహించారు. పలుప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రంగా తయారు చేశారు. అనంతరం చెత్త నిర్వహణను కట్టుదిట్టంగా నిర్వహించి పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ బూనారు.
యువపోరు పేరుతో జగన్రెడ్డి దొంగాట ఆడుతున్నాడని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ
దేశంలో పొడవైన రహదారిగా గుర్తింపు పొందిన ముంబై - చెన్నై జాతీయ రహదారిపై ములకలచెరువు కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. మూడేళ్లగా రాత్రిళ్లు భయం...భయం, ములకలచెరువు కనపడదు. అసలు ఇది జాతీయ రహదారేనా, ఇక్కడ అసలు ఊరు ఉందా అనే అనుమానం నెలకొంటోంది.
భక్తులు వైకుంఠ ఏకాదశి వేడుక లను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. స్వామివారిని వైకుంఠ ద్వారదర్శనం చే సుకొని పునీతులయ్యారు.
సోషల్ మీడియా ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్య మాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ విద్యాసాగర్నాయుడు హెచ్చరించారు.