Home » Anantapur urban
సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డిని పలు ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరుగా కలిశాయి.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటివెంకటేశ్వరప్రసాద్ అన్నారు. శుక్రవారం అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. నగరంలోని పలు కాలనీల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకోవడంతోపాటు అర్జీలు సమర్పించారు.
భవిష్యత తరాలకు మనం ఇచ్చే ఆస్తి పచ్చని పర్యావరణమే అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని స్థానిక దేవరకొండ గిరిప్రదిక్షణ మార్గం 3.2 కి.మీలలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేచర్ వెల్పేర్ కౌన్సిల్ అధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంత రైతాంగాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, సీపీఐ నేతలు రైతులతో క లిసి సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఎదగాలం టే కూటమి ప్రభుత్వానికి మరో 15 ఏళ్లు ప్రజలు అధికా రం ఇవ్వాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బం డారు శ్రావణిశ్రీ అ న్నారు.
పేదల ఇంటి పెద్ద కొడుకు సీఎం చంద్రబాబు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు.
జిల్లాలో ముందస్తు వర్షాలు కురుస్తున్నాయని, రైతులు ఖరీ్ఫకు సిద్ధంకావాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. త్వరలోనే ప్రభుత్వం విత్తన కాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని సనప గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు.
ఇళ్లు నీటమునిగితేనే ప్రజాప్రతినిధులు, అధికార ులు స్పందిస్తారా అని కురుగుంట వైఎస్సార్ కాలనీ వాసులు మండిపడ్డారు. కాలనీకి ఆనుకుని ఓ ప్రైవేటు కంపెనీ వెంచర్ వేశారు. కాలనీ పైభాగం నుంచి వచ్చే వర్షపునీరు వంకలోకి వెళ్లేందుకు వీలులేకుండా నిర్మాణం చేపట్టడంతో కాలనీవాసులు శుక్రవారం వెంచర్ ముఖద్వారం వద్ద నిరసనకు దిగారు.
ప్రజాదర్బార్లోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం అనంతపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
వైసీపీ పాలనలో మాదిరిగా పార్టీలు చూడమని, అర్హత ఉంటే ఎలాంటి సంక్షేమ పథకమైనా అందుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించారు.