Home » Anantapur urban
నగరంలోని అన్ని శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు తెలిపారు. శుక్రవారం స్థానిక నవోదయకాలనీలో ఉన్న శ్మశానవాటికను కమిషనర్ పరిశీలించారు. శ్మశానవాటికలో చెత్త దిబ్బలు, ముళ్లపొదలను తొలగించాలని శానిటేషన సిబ్బందిని ఆదేశించారు.
జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు ప్రొఫెసర్లకు అవార్డులు దక్కాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇనస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు.
వ్యవసాయం రంగంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ శింగనమల మండలంలోని కేంద్ర వ్యసాయ యంత్రముల శిక్షణ మరియు పరీరక్ష సంస్థ(ట్రాక్టర్ నగర్)ను కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు.
నెలలనిండకుండానే పుట్టిన తమబిడ్డను 900గ్రామల నుంచి 1620 గ్రాములు బరువుపెరిగేలా ఆరోగ్యవంతమైన పాలను దానం చేసిన మదర్ మిల్క్బ్యాంక్ అమృతంలాంటిదని నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు రాజేశ్వరి, కృష్ణమూర్తి ఆనందాన్ని వ్యక్తంచేశారు.
కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు హార్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్, మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
అనంతపురం అర్బనలో జరుగుతున్న అన్ని పరిణామాలను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోందని, ఎవరికీ నష్టం జరగనివ్వదని జోన-5 ఇనచార్జి కోవెలమూడి నాని(రవీంద్ర) పేర్కొన్నారు. సోమవారం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ నియోజకవర్గ క్లస్టర్ ఇనచార్జులతో కలిసి విజయవాడలో నానితో భేటీ అయ్యారు.
సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. శనివారం రాత్రి మండల కేంద్రంలో టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి నిరసన చేపట్టారు.
ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతంగా బస్ స్టేషన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. పట్టణంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్లో రూ.5కోట్ల అంచనా వ్యవయంతో నూతన బస్ స్టేషన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పనులు చేపడుతున్నట్లు విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. బస్టాండ్లో రూ.50 లక్షలతో చేపట్టిన విస్తరణ పనులకు శనివారం ఆయన భూమిపూజ చేశారు.
ప ట్టణ సమీపంలోని గ న్నెవారిపల్లికాలనీలో శనివారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘ టనలో 8 మంది గా యపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉం ది. గన్నెవారిపల్లికాలనీకి చెందిన జనార్దన, జ్యోతి దంపతులు.