Home » Anantapur urban
ప్రభుత్వం తాజాగా తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం వస్తువుల కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. మండలంలోని పేరూరు గ్రామంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వీరిద్దరూ అక్కచెల్లెల్లు. పేర్లు.. సత్యమ్మ, భ్రమరాంబ. సమస్య ఏమిటని అధికారులు అడిగితే.. ‘మేము అనంతపురంలో ఉంటున్నాం.
ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సేవలు అత్యవసరమని, ఆ సంస్థకు ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేసి ఇబ్బందులు తీర్చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. శాసనసభ సమావేశంలో సోమవారం ఆమె మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ద్వారా లక్షల మంది పేద వర్గాలకు విద్య, వైద్యం సదుపాయంతో పాటు వ్యవసాయ రంగంలో సహకారం అందుతోందన్నారు.
దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సంస్థ ఒక వరమని, అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసి కాపాడాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
గ్రంథాలయ సమస్యలను ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం ప్రస్తావించారు. ఆధునిక దేవాలయాలైన గ్రంథాలయాలను డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.
డా క్టర్లు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. వేళకు విధులకు రాకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులేమో కలెక్టరేట్లో గ్రీవెన్స అని వెళ్లిపోయారు. ఇదే అదనుగా డాక్టర్లు, సి బ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
గురువులు సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో గురువులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.
ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని మాల్యం గ్రామంలో వెలసిన కల్లేశ్వర ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మండలంలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాకులు సిలిండర్ ధర మీద అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. గృహ వినియోగం కోసం సరఫరా చేసే సిలిండర్లను కమర్షియల్ కోసం వాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్యాస్ లేనిదే ఇంట్లో ఎలాం టి పనులు జరగవు.
జిల్లా పరిషత కార్యాలయంలో 9 మందికి కార్యాలయ సబార్డ్నేటర్స్గా మంగళవారం కారుణ్యనియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం సీఈఓ శివశంకర్ ఆధ్వర్యంలో చేపట్టారు.