Home » Anantapur urban
హిందువులపై ఎక్కడ దాడి జరిగినా విశ్వ హిందూ పరిషత(వీహెచపీ) ఇక ఉపేక్షించదని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఊరే గింపులో హిందువులపై ముస్లింల దాడిని నిరసిస్తూ సోమవారం వీహెచపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా వందలాదిమందితో కృష్ణ కళామందిర్ నుంచి క్లాక్టవర్, సప్తగిరి సర్కిల్, పాతూరు మీదుగా కలెక్ట రేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
మండలంలోని తిమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆంజేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, పలువురు టీడీీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నా రు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఉదయం 7గంటలకు పలు హోమాలు నిర్వహించారు.
నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత పాఠశాలకు సంబంధించి ఐదె కరాల ఆటలస్థలం ఉంది. కానీ అడేందుకు సరియైున వసతులు లేవు. ఐగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మండలంలో రాష్ట్ర స్థాయిలో ఆటల్లో ప్రతిభ చూపి న విద్యార్థులు, యవకులు ఎంతోమంది ఉన్నారు. ఉన్న ఆటస్థలంలోనే సాధన చేసి వారు మంచి ప్రతిభ చూపారు. వారిని ఇంకా తీర్చిదిద్దేందుకు వసతులు కరువయ్యాయి.
నగరంలో ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మంటలు రగులు తూనే ఉన్నాయి. దాదాపు వారం రోజులుగా మెల్లమెల్లగా మై దానం మొత్తం విస్తరిస్తోంది. అకతాయిలు వేసిన నిప్పురవ్వకు చెట్లు బూడిద అవుతున్నాయి.
ఓ వైపు చాంపియనషిప్ క్రికెట్ ఫైనల్స్...మరోవైపు ఆదివారం సెలవు, ఎండ తీవ్రతతో నగరంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. నగరంలోని టవర్క్లాక్, సుభాష్రోడ్డు, రాజురోడ్డు, కమలా నగర్, శ్రీకంఠం సర్కిల్, హౌసింగ్బోర్డు, సాయినగర్, అశోక్నగర్, శారదా నగర్, కలెక్టరేట్ రోడ్డు, కోర్టురోడ్డు, రామ్నగర్ ప్లై ఓవర్, టవర్క్లాక్ ప్లైఓవర్ తో పాటు జాతీయ రహదారులలో వాహనాల రాకపోకలు, జనసంచారం కనిపించలేదు.
మండలంలోని అయ్యవారిపల్లిలో ఎర్రితాతస్వామి పరుష సందర్భంగా శనివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఆలయం వద్ద నిర్వహించిన పోటీలకు పలు ప్రాంతాల నుంచి వృషభాలు హాజరయ్యాయి.
టీచర్ల సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు తొలగించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. ఆ సంఘం నాయకులు శనివారం సైన్స సెంటర్ లో డీఈఓను కలిశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గోవిందరాజు, ప్రధానకార్యదర్శి లింగమయ్య, ఇతర నేతలు మాట్లాడుతూ...జాబితాల్లో కొందరు టీచర్ల పేరు కనిపించడంలేదన్నారు.
సైకో ప్రకాష్రెడ్డీ.. అధికారంలో ఉన్నప్పుడు పేరూరు ప్రాజెక్టుకు నీరు ఇచ్చే పనులు చేయకుం డా ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..? అని ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. శనివారం అనంతపురం నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు చెందిన 30 మందికి రూ.33.32 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పరిటాల సునీత అందజేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహిం చారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలతో పాటు వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఇకపై సహించ బోమని విశ్వహిందూ పరిషత జిల్లా అధ్యక్షుడు తాళంకి వెంకట రత్నమయ్య పేర్కొన్నారు. వీహెచపీ స్థానిక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.