Home » Ambati Rayudu
జనసేన స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు (Ambati Rayudu) తన ప్రసంగంతో ఇరగదీస్తున్నారు. అటు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ను (Pawan Kalyan) ఆకాశానికెత్తేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకునే సరికి.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక పార్టీ మారిన నేతలు అయితే.. బాబోయ్ మునుపటి పార్టీ బాగోతం బట్టబయలు చేస్తున్నారు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా మీడియా మీట్, బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ దుమ్ముదులిపేస్తున్నారు. తాజాగా.. ప్రముఖ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ (YSR Congress) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నది ఒకే ఒక్క మాటే అయినా.. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆయన ఏమన్నారో చూసేద్దాం రండి..!
క్రికెట్ మ్యాచ్లో ఫలితం ఎలా వచ్చినా.. దాన్ని ఆయా జట్టు కెప్టెన్లకే ఆపాదిస్తారు. అంటే.. మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ తెలివిగా రాణించాడని, ఓడిపోతే కెప్టెన్ విఫలమయ్యాడని కామెంట్లు వస్తుంటాయి. కానీ.. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన వాదనలు
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే ఆయా దేశాలు.. తమ జట్లను మే 1వ తేదీలోపు ప్రకటించాలని ఐసీసీ పేర్కొంది. దీంతో.. భారత సెలక్టర్లు ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది? ప్లేయింగ్ XIలో చోటు సంపాదించుకునే ఆటగాళ్లెవరు? అనేది చర్చనీయాంశం అవుతోంది. కెప్టెన్గా రోహిత్ శర్మ కన్ఫమ్ అయ్యాడు కానీ, ఇతర ఆటగాళ్లే విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేదు.
ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లీగ్ 2024ను తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఫేలవ ప్రదర్శనతో ప్రారంభించాడు. తన మొదటి మ్యాచ్లో సింగిల్ డిజిట్కే ఔటయ్యాడు. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్న రాయుడు శనివారం దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు.
అమరావతి, జనవరి 10: జనసేన అధినేత పవన్ కల్యాణ్తో భేటీ అనంతరం కీటక ప్రకటన చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ట్విట్టర్ వేదికగా.. పవన్తో భేటీ వివరాలను వెల్లడించారు. తాను స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన ఆశయాలు నెరవేర్చడానికి తాను వైసీపీలో చేరానని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో మాజీక్రికెటర్ అంబటి రాయుడు ( Ambati Rayudu ) బుధవారం నాడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సమావేశం అయ్యారు. జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారు. టికెట్పై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.
ఇటీవలే వైసీపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. కొద్ది రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి పొలిటికల్ ప్రకంపనలు సృష్టించారు. అయితే, తాజాగా అంబటి రాయుడు మరో సంచలన ప్రకటన చేశారు.