Home » Amaravati
‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే.. అసెంబ్లీకి వస్తానంటున్న నీకు సిగ్గుందా..?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైరయ్యారు. ఆయన మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.
అన్నప్రసాదాలకు కూరగాయలు విరాళంగా టీటీడీ(TTD)కి అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాలయ దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన సమావేశమయ్యారు.
రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ హయాంలోనే రైతులు యూరియా కోసం అవస్థలు పడ్డారని.. కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా కొరతకు తెరదించిందని స్పష్టం చేశారు.
మేత మేస్తూ ఓ పాడి గేదె ప్రమాదవశాత్తు బావిలో పడింది. అందులో నీళ్లు ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కానీ బయటకు వచ్చే మార్గం కాన రాక ఆ గేదె నీళ్లలోనే ఈదుకుంటూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత రైతు గేదె కోసం వెతకగా బావిలో కనిపించింది.
నగరంలో సూపర్ సిక్స్-సూపర్హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు.
అమరావతి మునిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారని మంత్రి నారాయణ హెచ్చరించారు.
‘అనంతపురం అర్బన్లోని ప్రతి ఇంటికీ వెళ్లండి.. ఆడపడుచులకు బొట్టుపెట్టి, సూపర్హిట్ సభకు ఆహ్వానించండి. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచే లక్ష మంది కదిలి రావాలి’ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ శ్రేణులకు సూచించారు.
టమోటా ధరలు నేలచూపులు చూస్తున్నాయి. కొన్నాళ్లుగా నిలకడగా సాగుతున్న ధరలు.. పతనస్థాయికి చేరుకుంటున్నాయి. వారం రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. కొన్నేళ్లుగా టమోటా ధరలు రైతులకు చేదు అనుభవాలనే మిగిల్చాయి.
ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. వరుసగా 60 అసెంబ్లీ పని దినాలకు హజరుకానిపక్షంలో వైసీపీ సభ్యులకు అనర్హత వేటు..
ప్రధాని మోదీ ప్రజల మనిషి అని... జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.