Home » Agriculture
కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ అప్పగింతకు గడువు పెంచాలని కేంద్రాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోరింది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది..
కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. దేశంలోని 24 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిసా, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. గతంలో స్పైసెస్ బోర్డు కింద ఈ పసుపు రైతులకు సేవలందేవి.
జ్యూస్ ఫ్యాక్టరీలకు పొరుగు జిల్లాల నుంచి కూడా మామిడి రైతులు తరలిరావడంతో ఫ్యాక్టరీల వద్ద కిలోమీటర్ల మేర తోతాపురితో వచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి.
ఆగ్రోఫారెస్ర్టీ(వ్యవసాయ భూముల్లో వృక్షాల పెంపకం)ని ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల్లోని వృక్షాల నరికివేతను సులభతరం చేస్తూ నమూనా నిబంధనలు జారీ చేసింది.
వాటర్ షెడ్ పథకం కింద రైతులకు అందించాల్సిన వ్యవసాయ పరికరాల టెండర్ల వివాదంలో తమ తప్పేమీ లేదని పంచాయతీరాజ్, ఆగ్రోస్ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారు.
వానాకాలం సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది.
రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని టొబాకో బోర్డు కుదించింది. 2025-26 పంటకాలానికి 142 మిలియన్ కేజీల ఉత్పత్తిని నిర్ధారించింది.
రాష్ట్రంలో యూరియా అమ్మకాల వ్యవహారం వివాదంగా మారింది. యూరియా అమ్మకాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర ఫెర్టిలైజర్, సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి (2022-23) ధాన్యం టెండర్లను రద్దు చేసింది. ఈ నెల 11 నాటికే గడువు పూర్తికావడం, అప్పటికే గుత్తేదారుల నుంచి పౌరసరఫరాల సంస్థకు చెల్లింపులు నిలిచిపోవడంతో టెండర్లు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. ప్రభుత్వం కల్పించుకుని రూ.4 సబ్సిడీ ప్రకటించినా రైతుల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేలా లేదు.