Home » Afghanistan
అఫ్గానిస్థాన్ను అడ్డం పెట్టుకుని భారత్ తమపై దాడికి యత్నిస్తోందని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. భారత్ చేతిలో కీలుబొమ్మగా అఫ్గానిస్థాన్ మారిందని కామెంట్ చేశారు.
దోహా చర్చల్లో అనుకున్నట్టే రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నదే శనివారం నాడు ఇస్తాంబుల్లో శాంతి చర్చల ఎజెండాగా ఉందని ఏఎఫ్పీ తెలిపింది.
నానాటికీ రెచ్చిపోతున్న పాక్కు భారత్ స్టైల్లో బుద్ధి చెప్పేందుకు అప్ఘాన్ సిద్ధమైంది. కునార్ నదిపై డ్యామ్ నిర్మించేందుకు రెడీ అవుతోంది. నదీ జలాల నిలిపివేతతో పాక్కు బుద్ధి వచ్చేలా చేయాలని భావిస్తోంది.
అప్ఘానిస్థాన్తో సరిహద్దును మూసియవేడంతో పాక్లో కూరగాయలు, పండ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. టమాటాల ధర ఏకంగా 400 శాతం మేర పెరిగి 600 పాకిస్థానీ రూపయ్యాలకు చేరుకుంది.
పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు ఆ రెండు దేశాల క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. త్వరలో జరగాల్సిన ట్రై సిరీస్ నుంచి ఆఫ్గాన్ జట్టు తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం ఆపటం తనకు చాలా సులువైన పని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పటి వరకు తాను 8 దేశాల మధ్య యుద్ధం ఆపానని, ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తొమ్మిదవది అవుతుందని వెల్లడించారు.
అఫ్ఘానిస్థాన్తో ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్లో ఉంటున్న అఫ్ఘానిస్థానీలు అందరూ దేశాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం ఉన్న వారు ఇతర దేశాలు భూభాగాలు, వనరులపై ఆధారపడరని అన్నారు.
పాకిస్థాన్ వైమానిక దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు చనిపోవడంపై ఆఫ్గన్ క్రికెట్ కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక పాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ చర్యను పూర్తిగా అనైతికంగా, అమానుషంగా ఆయన పేర్కొన్నారు.
పాక్ దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు మరణించడంతో అప్ఘాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాక్, శ్రీలంకతో జరగాల్సిన ట్రైసిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
కాబూల్లోని టీటీపీ స్థావరాలపై పాక్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీంతో ఆప్ఘనిస్తాన్ దళాలు విజృంభించాయి. సరిహద్దుల వెంబడి ఉన్న పాకిస్తాన్ మిలటరీ పోస్టులపై దాడులు చేయటం మొదలెట్టాయి.