Home » ABN
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగ్గా.. వాటికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలిలా ఉన్నాయి.
ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు.
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే ఎయిర్పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు.
అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై నేడు ధన్యవాదాల తీర్మానం, చర్చ నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ చర్చను ప్రారంభించనున్నారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేయడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో ఉన్న హీరో షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు షోరూం అంతటా వ్యాపించడంతో సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో పీటీ వారెంట్ జారీ చేశారు. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూలు చేసినట్లు అంబటిపై ఆరోపణలు ఉన్నాయి.
ఏపీ అసెంబ్లీ వేదికగా ఎన్డీఏ కూటమి పవర్ ప్యాక్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వీచ్తో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదొక విప్లవాత్మక ముందడుగని ఆయన పేర్కొన్నారు.