Home » ABN
హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి రూ.50 వేలు ఖరీదు చేసే ఇంజెక్షన్ ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంజెక్షన్లు అన్ని హెల్త్ సెంటర్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
హైడ్రోజన్ అనేది చాలా తేలికైన వాయువు. ప్రకృతిలో సమృద్ధిగా లభించే దీన్ని.. బెలూన్లలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే.. వీటి నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే.. ఎందుకు దీనిపై అప్రమత్తత అవసరం.? ఈ వాయువు వల్ల కలిగే లాభ నష్టాలేంటి? ఓ సారి తెలుసుకుందాం.
గతేడాది ఇదే సమయంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను ప్రభుత్వం చేపట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమంపై బీఆర్ఎస్ నేతలు అనవసరంగా బురద జల్లుతున్నారంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. తాము ఎంతో నాణ్యమైన చీరలు అందజేస్తున్నా.. అవి బాగాలేవని ప్రజల్లో దుష్ప్రచారం కల్పించడం తగదన్నారు.
ఈరోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవమని.. అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు.
ఉదయ్పుర్లో ఇటీవల అట్టహాసంగా జరిగిన ఓ ఎన్నారై కుమార్తె వివాహానికి అమెరికన్ హాలీవుడ్ తార జెన్నిఫర్ లోపెజ్ హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు వచ్చేందుకు ఆమె తీసుకున్న ప్యాకేజీయే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దీని గురించే అందరూ చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నర్సంపేటలో కొందరు యువకులు తాగిన మైకంలో బూతులు మాట్లాడుతూ ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన దేశ పౌరులకు ఓ లేఖ రాశారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను గౌరవించాలని అందులో సూచించారాయన.
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ భారత మహిళను షాంఘై విమానాశ్రాయంలో చైనా అధికారులు నిర్బంధించడంపై భారత్ మండిపడింది. చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే ఇండియా పాస్పోర్ట్ ఆమెకు ఉన్నప్పటికీ అక్కడి అధికారులు ఆమెకు అనుమతి నిరాకరించడం పట్ల తమ దౌత్యపరమైన నిరసనను తెలిపింది.