Home » ABN
జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. జాతీయ జెండా మన ఐక్యతకు చిహ్నం.. భవిష్యత్కు మార్గదర్శకమని తెలిపారు.
చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జిలో జరిగిన భారత స్వాతంత్ర్య వేడుకల్లో ప్రముఖ నటి త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచారు. త్రిష తన తల్లితో కలిసి ఈ వేడుకలకు వచ్చారు. సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చొన్న ఆమె.. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె కూర్చొన్నారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,894 కోట్ల ఆదాయం వచ్చిందని జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు. 32 వేల మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ.3,300 కోట్ల ఆదాయం పొందిందని వివరించారు.
కన్వర్ యాత్ర సందర్భంగా 180 కిలోమీటర్లు నడిచి, 61 లీటర్ల కన్వర్ను మోసిన మాన్సీ ఠాకూర్ ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్గా మారారు. అయితే తనను మోనాలిసాతో పోల్చడం ఆమెకు నచ్చలేదు. పేరు, రూపంతో కాదు.. మహాదేవునిపై తన భక్తితోనే గుర్తింపు పొందాలంటూ మాన్సీ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి..
లక్నోలో 75 ఏళ్ల వృద్ధుడి అంత్యక్రియలకు ముందు ఖాళీ కాగితాలపై ఆయన బొటనవేలి ముద్రలు తీసుకున్నట్లు కనిపించిన వీడియో వైరల్గా మారింది. కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..
చేపల వేటకు వెళ్లిన జాలరి ముఖాన్ని ఒక ఆక్టోపస్ చుట్టేయడంతో నానా అవస్థలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరి మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు..
పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.