Home » ABN Andhrajyothy
ఏసీబీ అధికారుల వలలో మరో ఉన్నతాధికారి చిక్కారు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం బకాయిలను చెల్లించకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వానికి భారీగా బకాయిపడిన 20 మంది మిల్లర్ల జాబితాను ఈడీకి అందజేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
‘ప్రక్షాళన’ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం.
హైదరాబాద్లో తిరుమల తరహాలో జరుగుతున్న భారీ కల్తీ నెయ్యి దందాను ఏబీఎన్ ఫోకస్ బట్టబయలు చేసింది.
టీమిండియా డ్రెసింగ్ రూమ్ వాతావరణంపై తాజాగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకునే విషయంలో ఆటగాళ్లకు సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు.
రేణిగుంటలో గుర్తుతెలియన మృతదేహం కలకలం రేపింది. బాలాజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఆవరణలో ఈ మృతదేహం వెలుగులోకి వచ్చింది. ఇంకుడు గుంత కోసం జేసీబీ సాయంతో తవ్వుతుండగా మట్టిలో డెడ్ బాడీ బయటపడింది.
పాకిస్థాన్కు చెందిన ప్రముఖ టిక్టాకర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు.
ఇరాన్కు సహాయం చేసే కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని దాని మిత్రదేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలా చేయని పక్షంలో భారీ ఆర్ధిక మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోలేకపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో పట్టికలో భారత్ పరిస్థితి ఏమిటంటే...
ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సాధారణ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.