Home » 2024
గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలను బలోపేతం చేయడానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృషిచేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. నూతనం గా ఎంపికైన మండలంలోని ప్యాదిండి గ్రామానికి చెందిన గొర్రెల పెంపకం దారుల సంఘం సభ్యులు సోమవారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని మ ర్యాదపూర్వకంగా కలిశారు.
వైసీపీ పాలనలో చేపట్టిన భూ రీసర్వేలో రైతుల భూ విస్తీర్ణానికి సంబంధించి భారీ వ్యత్యాసాలు వచ్చాయనే విమర్శలు వచ్చాయి. దీంతో చాలా చోట్ల రీసర్వే వద్దన్నారు. అయినా పాల కులు అధికాలు బలవంతంగా భూ రీసర్వే చేపట్టి, వ్యత్యాసాలతోనే జాయింట్ ఖాతా నంబర్లు, ఎల్పీ నంబర్లతో భూహక్కు పుస్తకాలను సంబంధిత రైతుల కు ఇచ్చి, అలాగే వైబ్ల్యాండ్లో నమోదు చేశారు.
సరళమైన పదాలతో అందరి నోట తన పద్యాలు పలికించిన మహాకవి యోగివేమన అని కలెక్టరు డాక్టరు వినోద్కుమార్ కొనియాడారు. ఆయన పద్యాలు చిరస్మ రణీ యమన్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో యోగివేమన జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన గృహం సందర్శనకు సంబంధించి విజ్ఞాన విహార యాత్ర పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు. నగరంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విడు దల చేశారు.
రోటరీ క్లబ్ చేపడుతున్న సేవలు అభినందనీయ మని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సౌజన్యంతో అనంతపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం వంద మంది మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ చేశారు. అనంతపురం క్లబ్ ఆవరణలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మిషన్లను పంపిణీ చేశారు.
కూటమి ప్రభుత్వం రాకతో పల్లెల రూపురేఖలు మారాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీల నిధులు పక్కదారి పట్టడంతో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం వీధిలైట్ల మరమ్మతులు చేయించుకోలేని దుస్థితిలో పంచాయతీలు ఉండేవి. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే గ్రామీణ సమస్యలపై దృష్టి సారించింది.
త్యాగరాజ స్వామి 178వ ఆరాధనోత్సవాన్ని శనివారం సాయంత్రం మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాణి సంగీత కళానిలయం ఆధ్వర్యంలో తొలుత త్యాగరాజస్వామి చిత్రపటానికి పూజలు నిర్వ హించారు.
పరిశుభ్రమైన వాతవర ణం గ్రామాల అభివృద్ధికి తోర్పడుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించా రు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా స్వచ్చాంధ్రప్రదేశను చూడాలం టే మన ఇళ్లు, మన వీధుల నుంచే పరిశుభ్రత ప్రారంభం కావా లని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం రామగిరిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో అఽమె అధికారు ల తో కలిసి పాల్గొన్నారు.
నగరంలో పరిశు భ్రత విషయంలో త్వరలోనే మార్పు చూస్తారని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్ అన్నారు. శనివారం నగరపాలిక ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నగరంలోని పాతూరులో నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, కమిషనర్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్రెడ్డి, వాసంతి సాహిత్య, అధికారులు, నాయకులు హాజరయ్యారు.