తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే స్థానాన్ని తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం భర్తీ చేయనుందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ జోస్యం చెప్పారు.
కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ విడుదల చేసిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్ ఇప్పటి కూడా పెద్ద సంఖ్యలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందని.. ఇండియాను, కాశ్మీర్ను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆ రిపోర్టు తెలిపింది.
అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది తీరంలోని బస్తీ ఘాట్ వద్ద శనివారం నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ ప్రమాదం సంభవించింది.
మూఢనమ్మకాల కారణంగానే నొయిడాను నాయకులు పట్టించుకోలేదనీ, ఇక్కడకు వస్తే పదవి కోల్పోతామని గత పాలకులు భయపడుతుండేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
విద్యార్థులతో కలిసి టీచర్లు మద్యం సేవించిన ఘటన బిహార్లో చోటుచేసుకుంది. ఇలా కొందరు చెత్త పనులు చేస్తూ ఉపాధ్యాయ వృత్తికే అపకీర్తి తెస్తున్నారు. వివరాల్లోకెళితే...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 164 మంది అభ్యర్థుల జాబితాను డీఎంకే శనివారంనాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మరోసారి కొలతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
పశ్చిమబెంగాల్లో ఎన్నికల వాతావరణం శనివారంనాడు ఒక్కసారిగా వేడెక్కింది. ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రధానాస్త్రంగా చేసుకుని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారం సాగించగా, శ్రీరామ నవమి ఊరేగింపులో అల్లర్లు, చొరబాటుదార్ల సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రచారం జరిపారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బెంగాల్ను నాశనం చేసే ప్రయత్నంలో ఆ పార్టీ దేశంలోనే అధికారంలో లేకుండా పోతుందని అన్నారు. ఢిల్లీని పట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలను తాను ఏకతాటిపైకి తెస్తానని చెప్పారు.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2004 - 2014 మధ్య కాలంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేవలం ఫైళ్లకే పరిమితమైందని, అభివృద్ధి పట్ల కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి లేమికి ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు.
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులున్నారు.