మధ్యప్రదేశ్లోని అశోక్నగర్లో యువతి, యువకుడి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో సరికొత్త టీమ్ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నితిన్ నబిన్ కొత్త టీమ్కు రంగం సిద్ధం అవుతోంది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణె లోహగడ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ పోలీసుల విచారణలో సంచలన విషయం వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఏడుగురు మృతిచెందిన ఘటన జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రాజరప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ-బార్లాంగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కొత్త చీఫ్గా మహేశ్ దీక్షిత్ను కేంద్రం నియమించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తాజాగా సమావేశమై.. ఆయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది.
భారత్, యూకే మధ్య కుదిరిన ప్రతిష్ఠాత్మక 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం', అలాగే 'డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్' ఒప్పందాలు వచ్చేనెల 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వీటి ప్రాముఖ్యత గురించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
వివాహ వేడుకకు తాగి వచ్చిన వరుడికి వధువు తగిన బుద్ధి చెప్పింది. అందరి ఎదుటా ధైర్యంగా నిర్ణయం తీసుకుని ప్రశంసలు అందుకుంది. ఆమె నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ సైతం అభినందించారు.
తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన కొత్త పుస్తకం ‘జార్జియాస్ విజన్’లో 2023 నాటి భారత పర్యటనకు సంబంధించిన ఒక విశేషాన్ని పంచుకున్నారు.
పాస్పోర్టుల జారీ ఫీజులను పెంచుతూ గురువారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 14 ఏళ్ల అనంతరం వీటిని పెంచుతున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. నూతన ఫీజులు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.