ముంబైలో అర్ధరాత్రి ఓ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. డ్రగ్స్ సేవించిన వ్యక్తి.. సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు వచ్చి.. ఆమెను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ యువతపై ప్రశంసలు కురిపించారు. యువత పట్టుదల దేశానికి అతిపెద్ద శక్తి అని అన్నారు. నవంబర్ నెలలో జరిగిన పలు స్ఫూర్తిమంతమైన ఘటనల గురించి కూడా ప్రధాని పంచుకున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలతో సహా మరికొందరిపై ఢిల్లీ ఈవోడబ్ల్యూ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురి పేర్లు నమోదు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఏ స్థాయిలో పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక సార్లు రుజువు కాగా.. తాజాగా బిహార్ లో మరోసారి నిరూపితమైంది. ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 935 పోస్టులకు 9.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఓటర్ జాబితా సంబంధిత విధుల్లో పాల్గొనే బీఎల్ఓ, సూపర్వైజర్ల పారితోషికాన్ని ఈసీ పెంచింది. ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు హానరేరియమ్ను కూడా ప్రకటించింది.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో మంటలు చెలరేగగా.. ప్రమాదాన్ని పసిగట్టి తేరుకునేలోపే మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
ఏ320 విమానాల్లో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే మార్పులు చేర్పులు పూర్తయినట్టు ఇండిగో ఎక్స్ వేదికగా తెలిపింది. తాము 90 శాతం మేర మాడిఫికేషన్స్ను పూర్తి చేశామని ఎయిర్ ఇండియా కూడా వెల్లడించింది.
వీధి కుక్కల బెడదపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శనివారం 50 వేలకు మందికి పైగా పౌరులు సుప్రీంకోర్టుకు లేఖలు రాశారు.
చల్లచల్లని శీతాకాలంలో అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా చర్చలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
కర్ణాటక రాజకీయాల్లో కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఒకచోట సమావేశమై పలు అంశాలపై చర్చించారు.