మహాగఠ్బంధన్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బయటపెట్టిన ఎన్డీయే కార్యకర్తల అవిశ్రాంత కృషిని ప్రధాని ప్రశంసించారు. బిహార్ అభివృద్ధిని ఎన్డీయే కొనసాగిస్తుందని, యువకులు, మహిళల బంగారు భవిష్యత్తుకు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.
మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవలం 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది.
హర్మీత్ సింగ్ సంధుకు తరన్ తారన్లో ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయినప్పటికీ ఆయన 68,235 ఓట్లు దక్కించుకుని గెలుపును సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కరణ్బీర్ సింగ్ బుర్జ్ 22,473 ఓట్లు, సాద్ అభ్యర్థి సుఖ్వీందర్ కౌర్ 7,158 ఓట్లు, బీజేపీ అభ్యర్థి హర్జిత్ సింగ్ సంధు 3,042 ఓట్లు సాధించారు.
బీజేపీ 95 సీట్లలో గెలుపును ఖాయం చేసుకుని రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించనుండగా, జేడీయూ 82 సీట్లలోనూ, ఎల్జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో గెలుపును ఖాయం చేసుకున్నాయి.
భారీ మెజార్టీతో తనను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారని నవీన్ యాదవ్ పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలుపించినందుకు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు.
బీజేపీ ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుందని, నగ్రోటాతో పాటు బిహార్ ఎన్నికల్లో సాధించిన విజయమే ఇందుకు నిదర్శనమని గెలుపు అనంతరం దేవయాని రాణా వ్యాఖ్యానించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొడుతోంది. అదే సమయంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకి ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపుతోంది. నితీష్ కుమార్, ఎల్జేపీ ముందు ఆర్జేడీ పూర్తి స్థాయిలో డీలాపడింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్కడి ప్రజలు హస్తం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే.. కొన్ని సర్వే సంస్థలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ముందే తీర్పు ఇచ్చాయి. ఇప్పుడు అందరికీ ఉన్న సందేహం ఏంటంటే.. ఈ సర్వేలను నమ్మచ్చా?.. అని.. ఇంతకీ ఈ ఉపఎన్నికపై ఏ సర్వే సంస్థ ఏం అంచనా వేసిందో చూద్దాం.
విజయోత్సవ వేళ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాన మంత్రి మోదీ సాయంత్రం 6 గంటలకు విచ్చేయనున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్కు తాము గట్టి పోటీ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్కి 38 శాతం పైగా ఓటింగ్ వచ్చిందని వివరించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.