• Home » Elections » Lok Sabha

లోక్‌సభ

Lok Sabha Election 2024: నన్ను గెలిపిస్తే.. ఆ హామీలు నెరవేరుస్తా: కడియం కావ్య

Lok Sabha Election 2024: నన్ను గెలిపిస్తే.. ఆ హామీలు నెరవేరుస్తా: కడియం కావ్య

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Election 2024: అందుకే బీజేపీ రాముడిని వాడుకుంటుంది: రేవంత్‌రెడ్డి

Lok Sabha Election 2024: అందుకే బీజేపీ రాముడిని వాడుకుంటుంది: రేవంత్‌రెడ్డి

బీజేపీ (BJP) పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. నర్సాపూర్‌లో గురువారం కాంగ్రెస్‌ జనజాతర సభ జరిగింది. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలకు బీజేపీ అభ్యర్థి (రఘునందన్‌రావు) ఏం చేయలేదని మండిపడ్డారు.

Lok Sabha Election 2024: వారి జనాభా పెరిగింది..  ప్రత్యేక చట్టం తెస్తాం: రాజాసింగ్

Lok Sabha Election 2024: వారి జనాభా పెరిగింది.. ప్రత్యేక చట్టం తెస్తాం: రాజాసింగ్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సూర్యాపేటలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Lok Sabha Election 2024: రాజ్యాంగాన్ని మేము పరిరక్షిస్తాం: రాహుల్‌గాంధీ

Lok Sabha Election 2024: రాజ్యాంగాన్ని మేము పరిరక్షిస్తాం: రాహుల్‌గాంధీ

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

Loksabha Polls: పెద్దపల్లిలో కీ ఓటర్స్ వీరే..?

Loksabha Polls: పెద్దపల్లిలో కీ ఓటర్స్ వీరే..?

పెద్దపల్లి లోక్ సభ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2004 నుంచి ఎంపీ అభ్యర్థి మారుతున్నారు. మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వడం లేదు. పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ బరిలోకి దిగారు. ఈయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు.

Lok Sabha Election 2024:రేవంత్ నా సవాల్‪ను స్వీకరించకుండానే డైలాగ్‪లు కొడుతున్నారు: హరీశ్‌రావు

Lok Sabha Election 2024:రేవంత్ నా సవాల్‪ను స్వీకరించకుండానే డైలాగ్‪లు కొడుతున్నారు: హరీశ్‌రావు

తెలంగాణలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. కేవలం ఐదు నెలల కాలంలోనే రేవంత్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత తెచ్చుకుందని అన్నారు. బీజేపీ తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తుందని విమర్శించారు.

Congress: తక్కువ సీట్లలో కాంగ్రెస్ పోటీ..? ఎందుకంటే..?

Congress: తక్కువ సీట్లలో కాంగ్రెస్ పోటీ..? ఎందుకంటే..?

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్లు అవుతోంది. మోదీ- అమిత్ షా ద్వయం కాంగ్రెస్ పార్టీ ఇమేజిని క్రమంగా తగ్గించేశారు. ఈ సారి తక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. కేవలం 328 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించుకోవడానికి కారణం పెద్ద రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు న్యాయం చేయడం కోసమని తెలుస్తోంది.

Lok Sabha Election 2024:మోదీ పాలనలో అచ్చె దిన్ కాదు చచ్చే దిన్ వచ్చింది.. కేసీఆర్ ఫైర్

Lok Sabha Election 2024:మోదీ పాలనలో అచ్చె దిన్ కాదు చచ్చే దిన్ వచ్చింది.. కేసీఆర్ ఫైర్

మోదీ పాలనలో అచ్చె దిన్ రాలేదు కాని.. చచ్చే దిన్ మాత్రం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఇచ్చిన 150 హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా బుధవారం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. పటాన్ చెరు జాతీయ రహదారిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Lok Sabha Election 2024: నేను ఎన్ని కేసులు పెట్టినా భయపడను..  బీజేపీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

Lok Sabha Election 2024: నేను ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. బీజేపీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

బీజేపీ ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు దీక్ష చేసినప్పుడు వచ్చానని అన్నారు. వారు ఇచ్చిన సహకారంతో పీసీసీ అధ్యక్షుడినయ్యానని గుర్తుచేశారు. నిజామాబాద్ లోని ఆర్మూర్‌లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Lok Sabha Election 2024: మోదీ గెలిస్తే రష్యా మాదిరిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖతం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Lok Sabha Election 2024: మోదీ గెలిస్తే రష్యా మాదిరిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖతం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామని మాటిచ్చారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో రైతు బంధు ఆపించారని మండిపడ్డారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి