పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017, జూన్ 21వ తేదీన విశాల్ తల్లి ప్రభా దేవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత విశాల్ ఇన్సురెన్స్ కంపెనీల నుంచి 80 లక్షల రూపాయలు పొందాడు.
నాటు తుపాకీతో కోడిని కాల్చుతున్న సమయంలో, గుండు గురితప్పి యువకుడికి తగలగా అతను ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కళ్లకుర్చి జిల్లా కల్వరాయన్ కొండ ప్రాంతాలోని మేల్మదూర్ గ్రామానికి చెందిన అన్నామలై, తన అల్లుడికి కోడి కూర చేయాలని, దానికోసం తాను సంరక్షిస్తున్న కోళ్లను పట్టుకునేందుకు యత్నించగా, అవి చిక్కలేదు..
వరుసగా వివాహేతర సంబంధాలతో తనకు చెడ్డపేరు తీసుకొస్తోందని ఆగ్రహించిన ఓ తండ్రి తన కుమార్తెను హతమార్చిన ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. మార్కండయన్కోట ప్రాంతానికి చెందిన ప్రవీణ విభేదాల కారణంగా భర్తను వదిలి పదేళ్లుగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
మద్యం మత్తులో యువకులు 102 అంబులెన్స్పై దాడి చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి కోఠి ప్రసూతి ఆస్పత్రి నుంచి ఇద్దరు బాలింతలను ఇబ్రహీంపట్నం సమీపంలోని నాగిళ్ల మడుగుకు అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు.
ఇంటికి తిరిగి వచ్చిన జయమ్మ, భీమవ్వ రక్తం మడుగులో పడి ఉన్న పిల్లల్ని చూసి షాక్ అయ్యారు. ఇద్దరు పిల్లలు చనిపోవటంతో వారి గుండెలు బద్దలయ్యాయి. గుండెలు అవిసేలా వెక్కి వెక్కి ఏడ్చారు.
చీరలు దొంగిలించిన ఓ మహిళను షాపు యజమాని ఇష్టారీతిన కొట్టిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. అయితే, చోరీ చేసిన మహిళతో పాటు ఆమెపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని.. వెంటనే చెల్లించాలంటూ ఆర్టీఏ చలాన్ పేరుతో ఏపీకే లింక్లు పంపిన సైబర్ నేరగాళ్లు ఇద్దరు నగరవాసుల నుంచి రూ.6.08 లక్షలు కాజేశారు. బేగంబజార్కు చెందిన వ్యక్తి(50)కి వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు సందేశం పంపారు.
మద్యం మత్తులో భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవజీవన్నగర్ (గీతానగర్)లో బుధవారం రాత్రి జరిగింది. బాలానగర్ సీఐ టి.నర్సింహారాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
డేటింగ్ యాప్లో పరిచయమైన వ్యక్తి (గే) తాను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానంటూ ఓ వైద్యుడిని బెదిరించాడు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసు ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన తమన్నగారి సతీష్కుమార్ (23) తిరుపతిలో హత్యకు గురయ్యారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రైలు పట్టాల పక్కన ఈ ఘాతుకం జరిగింది. తిరుపతి రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపిన ప్రకారం.. ఆర్గొండ గ్రామానికి చెందిన సతీష్ కుమార్ ఒక్కడే కుమారుడు.