విజయవాడలో సీబీఐ అధికారులు మెరుపు దాడులు చేశారు. రూ.179.50 కోట్ల రైల్వే ప్రాజెక్ట్లో రూ.7 కోట్ల బోనస్ మంజూరుకు సహకరించేందుకు రూ.15 లక్షల లంచం తీసుకుంటున్న సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనతో పాటు ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు..
భూములపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించి ఆస్తి పత్రాలను దుర్వినియోగం చేసి భారీ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడు నునావత్ యుగంధర్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో పంటలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులకు పంటల బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది..
గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై, అసెంబ్లీని బహిష్కరిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే తీరుపై బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్మెంట్కు దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లాలని, సభకు వెళ్లకపోవడం సరికాదని సీడబ్య్లూసీ సభ్యులు, మాజీమంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి.