మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్కు ఆదివారం రైతులు భారీ మొత్తంలో టమాటాలు తీసుకువచ్చారు. దీంతో ధర ఒక్కసారిగా పడిపోయింది. ఇక్కడ మార్కెట్కు సోమవారం సెలవు కావడంతో ఆదివారం రైతులు అధిక మొత్తంలో కూరగాయలు తీసుకువస్తుంటారు.
మహాత్మా జ్యోతిరావుఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఏళ్ల తరబడి అద్దె భవనంలో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి చాలకపోవడంతో అధికారులు, విద్యార్థుల ప్రవేశాలను సగానికి కుదించారు.
మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన డ్రెడ్జింగ్ పనులు ఇప్పటివరకు ప్రారంభమేకాలేదు. పోర్టు నిర్మాణం కోసం తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను పక్కనపెట్టి డ్రెడ్జింగ్ చేయడానికి అదనంగా మరో రూ.1500 నుంచి రూ.1600 కోట్లు కావాలని రైట్స్సంస్థ ద్వారా ఏపీ మారీటైమ్కు బోర్డుకు పంపిన ప్రతిపాదనలు పక్కపెట్టేశారని సమాచారం. డీపీఆర్లో ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చిందనే అంశంపై సదరు అధికారులు రైట్స్ సంస్థ ప్రతినిధులను నిలదీసి, ఆ ఖర్చును మీరే పెట్టుకోవాలని చెప్పారని తెలిసింది. ఇప్పటి వరకు డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించకుంటే పోర్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయనే ఆంశంపైన సర్వత్రా చర్చ నడుస్తోంది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులతో పోటెత్తారు. హరహరమహదేవ శంభోశంకర అంటూ భక్తుల శివ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. శైవక్షేత్రాల్లో అర్చకులు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించి, అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు కల్పించారు. కుటుంబాల సమేతంగా భక్తులు ఆలయాలకు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
కర్నూలుకు చెందిన కోవా బన్ వ్యాపారి వలీకి మంత్రి లోకేశ్ మద్దతుగా నిలిచారు. త్వరలోనే ఆయనను కలిసి, కోవా బన్ రుచి చూస్తానని ‘ఎక్స్’ వేదికగా తెలియజేశారు.
విజయవాడలో ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య(96) ఆదివారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన దుర్గాపురంలోని స్వగృహంలో....
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి వస్తున్నారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్...
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలను, సేవలను కొనసాగించేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రస్థానం సాగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రంపచోడవరం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మాజీ రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్పార్టీ గిరిజన మహిళా నేత తటపట్ల రత్నాభాయి(79) ఆదివారం అర్ధరాత్రి రంపచోడవరంలో మృతి చెందారు. గత కొంతకాలంగా స్వల్ప అనారోగ్యంతోనే ఉన్నా ఆమె అందరికీ అందుబాటులోనే ఉంటూ వచ్చారు. కాగా ఆదివారం రాత్రి బాగా పొ