Home » Andhra Pradesh » Guntur
మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికైన సభ్యుల సంఖ్య నిర్ధారణకు సంబంధించిన నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణ చేసింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని, ఇటీవలి కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పోర్టల్స్ గత వారం రోజులుగా మొరాయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నమోదు చేసుకోవటానికి రాష్ట్రంలోని వరి రైతులు ప్రయత్నిస్తుండగా, పోర్టల్స్ ఓపెన్ కావట్లేదు. నేషనల్ క్రాప్ ఇన్యూరెన్స్ పోర్టల్, పీఎంఎ్ఫబీవై పోర్టల్.. ఏదీ ఓపెన్ కావట్లేదని రైతులు వాపోతున్నారు.
పత్తికి డిమాండ్ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది.
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంతంలో రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ- మద్రాస్తో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మధ్య ఒప్పందం చేసుకుంది.
కడప బెసిన్లో కీలక ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్-నేషనల్ జియాలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)తో రాష్ట్ర గనుల శాఖ ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో గనులశాఖ, ఎన్జీఆర్ఐ ప్రతినిధులు ఒప్పందపత్రాలపై బుధవారం సంతకాలు చేశారు.
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేలా కీలక ముందడుగు పడింది. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి (జీజీహెచ్)లో రెండేళ్లుగా నిలిచిపోయిన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను తిరిగి ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఈ ఏడాది డిసెంబరు నుంచి ఎస్ర్కో ఖాతాలో జమ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడంలేదని, సభకు రానివాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకని, అలాంటివారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.