Home » Andhra Pradesh » Guntur
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిస్థాయిలో ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహాయ, సహాకారాలు అందిస్తామని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో నేడు ఆంధ్రప్రదేశ్ దేశానికే పెట్టుబడుల హాబ్గా నిలుస్తోందని పేర్కొన్నారు.
వికసిత భారత్- గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవిక మిషన్ (వీబీజీఆర్ఏఎం) కింద రూ.1192.16 కోట్ల నిధులను ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం గురువారం మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నిధులు మంజూరు చేసింది.
పల్నాడు జిల్లా నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గంలో కనిగిరి వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తి కావడంతో గుంటూరు - కనిగిరి మధ్య ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఒక మెమూ రైలుని నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులు, ప్రభుత్వంలోని పలు శాఖల కార్యదర్శలు, వివిధ విభాగాల అధిపతుల(హెచ్ఓడీ)కు ఆయన విందు ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నిధులు విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ యోజన (DAY), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రూ.207 కోట్ల నిధులు విడుదల చేసింది.
తెలుగుదేశం పార్టీకి గల్లీ పాలిటిక్స్ తెలుసు.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసునని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కారమే ఎజెండగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు.
విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు.
అమరావతిలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, రాష్ట్ర, జాతీయ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.