Home » Andhra Pradesh » Guntur
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆయన వివరించారు.
అనుమతించిన పరిమితుల కంటే గోదావరిలో ఎక్కువగా కాలుష్య కారకాలు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. జూన్ 10, 11 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జూన్ 10వ తేదీన నిర్వహించనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వీరు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఎరువుల పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఎఐఎంఎస్ 2.0 అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు, నరేంద్ర మోదీ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి 12 ఏళ్ల అయింది. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన విజయాలపై రాష్ట్రంలో నిర్వహించే బహిరంగసభలను విజయవంతం చేయాలని కూటమిలోని రాజకీయ పక్షాల నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి గొడ్డలి పార్టీ చేతులెత్తేసిందని విమర్శించారు.
2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం నాడు గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం నారాకోడూరులో సంవృద్ధి కేంద్రాన్ని కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన అత్యాచారం కేసులో మాజీ సీఐ చిన్న మల్లయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్లో ఆయన సరెండర్ అయ్యారు.