Home » Andhra Pradesh » Guntur
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
మొంథా తుఫాను దృష్ట్యా వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.
మొంథా తుఫాను దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మొంథా తుఫానుతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
కోస్తాంధ్రపై మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యంలో..
1200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టు శుభవార్త తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియమించిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లని విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తుపాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అంశాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లే ముందే మొంథా తుపాన్పై సమీక్ష నిర్వహించారని మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తెలిపారు. ఇప్పటి వరకు ఆయన 12 సార్లు ఈ తుపాన్పై సమీక్ష చేశారని వివరించారు.
మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను ఇవాళ(మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం
ఏపీలో మొంథా తుపాను ప్రభావంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ వైద్యా, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.