Home » Andhra Pradesh » Guntur
మంత్రి నారా లోకేశ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేస్తూ, ఆయన కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు.
డీఎస్సీపై రెండుసార్లు సమగ్ర వివరణ ఇచ్చినా నిరాధార ఆరోపణలే మళ్లీ మళ్లీ వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అక్టోబర్లో జాబ్ క్యాలెండర్లో భాగంగా మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ వస్తోందని చెప్పుకొచ్చారు.
ఏపీలో కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యార్థుల కోసం ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ తీసుకువస్తామని పేర్కొన్నారు.
స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 419 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ అధికారుల సోదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసత్య ఆరోపణలతో జగన్ మీడియా ముందుకు వచ్చారని ధ్వజమెత్తారు.
పారదర్శకంగా జరిగిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో కూడా వైఎస్ జగన్ గొడ్డలి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ, జనసేన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడం, నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే పోటీలో నిలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది.
తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది ప్రధాన మంత్రులను అత్యంత దగ్గరగా పరిశీలించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక అద్భుతమైన, విశిష్టమైన నాయకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.
ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ గత 12 ఏళ్ల ప్రయాణం... భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విద్యాసంస్థ రానుంది. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో గుర్తింపు పొందిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (GIIS) అమరావతిలో తన విద్యాసంస్థను స్థాపించేందుకు ముందుకొచ్చింది.