సబితా ఇంద్రారెడ్డిని నెట్టేసిన అసెంబ్లీ మార్షల్స్
ABN, Publish Date - Sep 07 , 2026 | 01:24 PM
తెలంగాణ అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద బీఆర్ఎస్ నిరసన, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర రచ్చకు దారి తీసింది. నల్ల టీషర్టులు ధరించి, ఫ్లకార్డులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద బీఆర్ఎస్ నిరసన, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర రచ్చకు దారి తీసింది. నల్ల టీషర్టులు ధరించి, ఫ్లకార్డులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మార్షల్స్ నెట్టేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తోపులాటలో కేటీఆర్ సహా పలువురు గులాబీ శ్రేణులు గాయాలయ్యాయి.
Updated at - Sep 07 , 2026 | 01:24 PM