Home » Sabitha Indra Reddy
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యంతో కా కుండా దొడ్డు బియ్యం భోజనమే వడ్డిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె బడంగ్పేట్ కార్పొరేషన్లోని నాదర్గుల్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట్, పహాడిషరీఫ్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆమె పరిశీలించారు.
మాజీమంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అభాగ్యుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు.. అభాగ్యుల సేవలో కొనసాగుతున్న మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ కార్పొరేషన్లో గల నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమానికి తన వంతు సాయంగా ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు.
అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. పథకాల విషయంలో విమర్శలు చేసుకుంటూ పోతే అర్హులైన పేద, బడుగు వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
‘ప్రజా సమస్యలు పట్టించుకోరా.. అసలు మీరు పని చేస్తున్నారా.. లేక టైంపాస్ కోసం కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ బడంగ్పేట్ కార్పొరేషన్ అధికారుల పని తీరుపై మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్లానింగ్లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధ్వజమెత్తారు.
దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి.. అంటూ మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైందని ఆమె విమర్శించారు.
సీబీఐ కోర్టు తాను నిర్దోషిగా ప్రకటించిన తీర్పుపై సబిత సంతోషం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాటు న్యాయం కోసం చేసిన పోరాటం చివరికి విజయమిచ్చిందని తెలిపారు.
గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలుశిక్ష నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవి అనర్హతలోకి వెళ్లే అవకాశం ఉంది.సీబీఐ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడంతో సబిత న్యాయం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.
సీబీఐ కోర్టు ఓఎంసీ కేసులో మంగళవారం (మే 6) తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు అధికారులు నిందితులుగా ఉన్నారు