Home » Sabitha Indra Reddy
బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్పై మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి సబితారెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని.. ఆమెకు గౌరవం ఇవ్వకపోతే అడగాలని.. మర్యాద లోపం ఉంటే తప్పు పట్టాలని అన్నారు.
Telangana: ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు కార్యక్రమాలు చేస్తున్నారని.. అధికారులు వారిని స్టేజి మీద కూర్చోబెడున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... పార్టీ కండువాలు కప్పుకుని ఓడిన అభ్యర్థులు చెక్కులు పంపిణీ చేస్తున్నారన్నారని సబిత అన్నారు.
బోనాల పండుగకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తలెత్తిన ప్రొటోకాల్ రగడ వివాదానికి దారితీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్(BRS, Congress) శ్రేణులు బాహాబాహీకి తలపడడంతో ఉద్రిక్తతతకు దారితీసింది.
తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎప్పుడు గులాబీ కండువా తీసేసి..
తన స్వార్ధం కోసం తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే సబితారెడ్డి(MLA Sabita Reddy) అధికార దాహంతో తిరిగి కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నించడం సహించరానిదని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రావాలంటే అదృష్టం కూడా ఉండాలని, నుదుటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోని మం త్రులు పాలనను మరచి కేవలం కేసీఆర్ను తిట్టడానికి పోటీపడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి(Former Minister, MLA Sabitha Reddy) అన్నారు.
అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిదు నెలల్లోనే ప్రజలకు సినిమా చూపిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) ఆరోపించారు.
ఓ అక్కగా చెబుతున్నా. మహిళల గురించి ప్రస్తావించాలనుకుంటే బాధ్యతగా, సంస్కారవంతంగా మాట్లాడాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి సీఎం రేవంత్రెడ్డికి సూచించారు.
Telangana: తెలంగాణ భవన్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ మహిళ కార్పోరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... తెలంగాణ ఆడ బిడ్డలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.