Share News

కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం

ABN , Publish Date - Jul 10 , 2026 | 08:03 AM

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..

కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం
Hyderabad Crime News

హైదరాబాద్, జులై 10: హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. అనారోగ్యంతో ఉన్న ఒక మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తానని నమ్మించిన ఒక ఆటో డ్రైవర్, ఆమె పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. నమ్మకం కలిగించేలా నడుచుకుంటూ, ఆమెకు తాగడానికి ఇచ్చిన కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపాడు. అది గమనించని బాధితురాలు ఆ పానీయం తాగడంతో కొద్దిసేపటికే స్పృహ కోల్పోయింది. ఆపై సదరు డ్రైవర్.. ఆటోను ఎవరూ లేని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.


స్పృహలో లేని ఆ మహిళ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను, నగదును దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు, జరిగిన ఘోరాన్ని గ్రహించి తీవ్ర ఆవేదనకు గురైంది. ఎలాగోలా స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆటో డ్రైవర్‌ను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశాయి. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఇవి కూడా చదవండి..

కాలు లేకున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.. వీడియో వైరల్

లోకో పైలట్ సమోసాల కొనుగోలు వీడియోపై స్పందించిన రైల్వే శాఖ

For More Viral News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 08:56 AM