యువతను రెచ్చగొట్టడం మానుకోవాలి.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ శ్రీధర్ బాబు
ABN , Publish Date - Jul 19 , 2026 | 02:46 PM
నిరుద్యోగ నిరసనలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.
కరీంనగర్, జులై 19: రాష్ట్రంలో నిరుద్యోగ నిరసనలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నిరుద్యోగ యువతను కేటీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో గ్రూప్-1 పరీక్షలను ఎందుకు సక్రమంగా నిర్వహించలేకపోయారో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడినందుకు ముందుగా బీఆర్ఎస్ నేతలే యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉద్యోగ నియామకాలు వేగవంతం అయ్యాయని మంత్రి స్పష్టం చేశారు. తాము ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాల భర్తీని పూర్తి చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. 'మీ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయగలరా?' అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ నిరుద్యోగుల పక్షానే ఉంటుందని, ప్రతిపక్షాల ట్రాప్లో పడి యువత తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ ప్రాణం పోశారు: సీఎం రేవంత్రెడ్డి
గంజాయి పండిస్తున్న సాధువు అరెస్ట్