Share News

దివ్యాంగ వధువులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:38 PM

తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాల కింద దివ్యాంగ వధువులకు అందిస్తున్న అదనపు సాయాన్ని కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దివ్యాంగ వధువులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్

హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాల కింద దివ్యాంగ వధువులకు అందిస్తున్న అదనపు సాయాన్ని కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వీరికి ఈ పథకాల వర్తింపుపై విధించిన స్టేను హైకోర్టు సోమవారం ఎత్తివేసింది. దివ్యాంగులకు మినహా మిగిలిన వారికి ఈ రెండు పథకాలపై విధించిన స్టే కొనసాగుతోందని స్పష్టం చేసింది. అయితే దీనిపై వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల గడువు కోరింది.


ఈ పథకాల కింద సాధారణ లబ్ధిదారులతో పోలిస్తే దివ్యాంగ వధువులకు 25 శాతం అదనంగా ఆర్థిక సాయం అందించేలా గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. సోమవారం ఈ పథకాల అమలుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. దివ్యాంగుల హక్కుల చట్టం నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో దివ్యాంగ వధువులకు ఈ పథకాల కొనసాగింపునకు ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది: సీఎం రేవంత్

పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా.. దేశాభివృద్ధి ఎలా సాధ్యం: అభిజీత్ దీప్కే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 06:12 PM