Share News

తెలంగాణలో భారీగా ఎమ్మార్వోల బదిలీ

ABN , Publish Date - May 27 , 2026 | 04:00 PM

రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు.12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో భారీగా ఎమ్మార్వోల బదిలీ
MROs Transfers In Telangana State

హైదరాబాద్, మే 27: రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు జరిగాయని జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు.

  • నిర్మల్‌కి చెందిన ఏ. మోతీరాంను మంచిర్యాల డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.

  • కరీంనగర్‌కి చెందిన బి. రాజేశ్వరికి పెద్దపల్లి డీఆర్వో బాధ్యతలు అప్పగించారు.

  • పెద్దపల్లికి చెందిన కె.వై.ప్రసాద్‌ను జగిత్యాల డీఆర్వోగా నియమించారు.


  • వనపర్తికి చెందిన ఆర్. పాండును నాగర్‌కర్నూల్ డీఆర్వోగా బదిలీ చేశారు.

  • ఖమ్మంకి చెందిన వి. రవి కుమార్‌ను ములుగు డీఆర్వో‌గా పోస్టింగ్ ఇచ్చారు.

  • మేడ్చల్-మల్కాజిగిరి జె.స్వామికి కరీంనగర్ డీఆర్వోగా బాధ్యతలు అప్పగించారు.


  • నాగర్‌కర్నూల్‌కి చెందిన ఎ. పాండుకు కామారెడ్డి డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.

  • జనగాంకి చెందిన సీహెచ్ శ్రీకాంత్‌కు మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియామించారు.

  • సూర్యాపేటకి చెందిన ఎం. సుదర్శన్ రెడ్డికి సిద్ధిపేట ఎస్‌డీసీ(ఎల్‌ఏ)గా బాధ్యతలు అప్పగించారు.


  • ఖమ్మం ఎం. రామదేవికి నల్గొండ ఎస్‌డీసీ(ఎల్‌ఏ) పోస్టింగ్

  • పెద్దపల్లి జి. కుమారస్వామికి సిరిసిల్ల ఎస్‌డీసీ(ఎల్‌ఏ) బాధ్యతలు

  • కరీంనగర్ ఎన్. వెంకట్ రెడ్డికి కరీంనగర్ ఎస్‌డీసీ(ఎల్‌ఏ)గా నియామకం


ఈ వార్తలు కూడా చదవండి..

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్

For More TG News And Telugu News

Updated Date - May 27 , 2026 | 04:34 PM