Hyderabad Youth Found Dead: గచ్చిబౌలిలో యువకుడు అనుమానాస్పద మృతి..
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:41 PM
కొండపూర్లో యువకుడు ఆనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్, జనవరి 01: గచ్చిబౌలిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం రాత్రి కొండాపూర్ శ్రీరాం నగర్ కాలనీ నుంచి బోటానికల్ గార్డెన్ వైపు.. పాలపిట్ట పార్క్ సమీపంలోని రహదారిపై శంకర్ (19) అనే యువకుడు నిర్జీవంగా పడి ఉన్నాడు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. అతడి జేబులోని సెల్ ఫోన్ ద్వారా అతని స్నేహితులకు సమాచారం ఇచ్చారు. స్నేహితులు వెంటనే పాలపిట్ట పార్క్ వద్దకు చేరుకుని శంకర్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. శంకర్ సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శంకర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాలపిట్ట పార్క్ సమీపంలో సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతడి మృతి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. మృతుడు శంకర్.. నగరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు
For More TG News And Telugu News