Share News

జహూర్‌ ఇక్బాల్ గ్యాంగ్ ఘాతుకం.. యువకుడి కిడ్నాప్.. కర్రలతో దాడి

ABN , Publish Date - Apr 04 , 2026 | 09:34 AM

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో జహూర్ ఇక్బాల్ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేసింది.

జహూర్‌ ఇక్బాల్ గ్యాంగ్ ఘాతుకం.. యువకుడి కిడ్నాప్.. కర్రలతో దాడి
Hyderabad News

హైదరాబాద్, ఏప్రిల్ 4: అత్తాపూర్ ప్రాంతంలో జహూర్ ఇక్బాల్ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. సద్దాం అనే యువకుడిని బైక్‌పై కిడ్నాప్ చేసి, చింతల్‌మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా దాడికి పాల్పడింది. సిద్దాంపై పిడి గుద్దుల వర్షం కురిపించడంతో పాటు.. కర్రలతో విచక్షణారహితంగా చితకబాది తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయింది. అందరూ చూస్తుండగానే గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.


గ్యాంగ్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన సద్దాంను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే గ్యాంగ్ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో ఉపయోగించిన కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై సద్దాం కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 25 మంది గ్యాంగ్ సభ్యులు ఈ దాడికి పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మరో 3 రోజులు..

పాత పేరు.. కొత్త అజెండా!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 04 , 2026 | 09:40 AM