భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఒకరి అరెస్ట్
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:00 PM
హైదరాబాద్ తార్నాక ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను ఎన్ఫోర్స్మెంట్ టీం స్వాధీనం చేసుకుంది. మొత్తం 67 మద్యం బాటిళ్లను స్వాధీన పరుచుకుంది.
హైదరాబాద్, ఆగస్టు 26: నగరంలోని తార్నాక ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను ఎన్ఫోర్స్మెంట్ టీం స్వాధీన పరుచుకుంది. మొత్తం 67 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.2లక్షలు ఉంటుందని వివరించింది. తార్నాకలో ఓ వ్యక్తి డిఫెన్స్ మద్యం బాటిళ్లు విక్రయిస్తున్నట్లు.. ఎన్ఫోర్స్మెంట్ టీంకు సమాచారం అందింది.
దీంతో ఆ ఇంటిపై బుధవారం దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటి యజమాని వద్ద తొలుత పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. అనంతరం ఆ ఇంట్లో సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా మరో 57 బాటిళ్లను గుర్తించింది. వాటిని కూడా స్వాధీనం చేసుకుంది.
పట్టుబడిన బాటిళ్లు కర్ణాటక, హర్యానా రాష్ట్రాలకు చెందినవని స్పష్టం చేసింది. ఈ మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న వ్యక్తి.. మాజీ సైనికుడి కుమారుడు ఆర్. మాధవన్గా గుర్తించామని పేర్కొంది. అతడిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్పగించామని ఎన్ఫోర్స్మెంట్ టీం వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇతరులకు నీతులు చెప్పే ముందు చరిత్ర చూసుకోవాలి జగన్: మంత్రి సత్యకుమార్ యాదవ్
ఉద్యోగానికి రాజీనామా చేసి.. బెజవాడ బయలుదేరిన భావన.. అంతలో..
For TG News And Telugu News