Share News

క్లాస్ రూమ్‌లోనే విద్యార్థులను చితక బాదిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్

ABN , Publish Date - May 14 , 2026 | 01:21 PM

విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థుల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..

క్లాస్ రూమ్‌లోనే విద్యార్థులను చితక బాదిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్
Assam Teacher Viral Video

ఇంటర్నెట్ డెస్క్: విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థుల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు. అస్సాంలోని చరాయిదేవ్ జిల్లా మథురాపూర్ బగీచా ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తరగతి గదిలో విద్యార్థులపై సదరు ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా దాడి చేస్తున్న దృశ్యాలు పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


పాఠశాల కార్యకలాపాలను పర్యవేక్షించే క్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయుడు క్లాస్ రూమ్ సీసీటీవీ ఫుటేజీని సమీక్షించారు. ఆ సమయంలో విద్యార్థులను ఉపాధ్యాయుడు మహ్మద్ అరిఫుల్ ఇస్లాం భౌతికంగా హింసిస్తున్న దృశ్యాలను చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలోనే పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మథురాపూర్ టినియాలి నివాసి అయిన 51 ఏళ్ల మహ్మద్ అరిఫుల్ ఇస్లాంను పోలీసులు నిందితుడిగా గుర్తించి తక్షణమే అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై సమగ్ర విచారణ ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం మత్తులో వీరంగం.. యువకులకు స్థానికులు దేహశుద్ధి

కార్లు వదలి.. బస్సులు, మెట్రోల్లో ప్రయాణించండి: కేంద్రం కొత్త ఆంక్షలు

For More National News

Updated Date - May 14 , 2026 | 01:47 PM