ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం..
ABN, Publish Date - Feb 19 , 2026 | 02:11 PM
తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ హైకమాండ్ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై రివ్యూ చేసినట్టు తెలుస్తోంది.
1/5
తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ హైకమాండ్ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది.
2/5
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. పాలనపై రివ్యూ చేసినట్టు తెలుస్తోంది.
3/5
ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.
4/5
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిగినట్లు సమాచారం.
5/5
అలాగే రానున్న రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై నాయకత్వం కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
Updated at - Feb 19 , 2026 | 07:14 PM