పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం
ABN, Publish Date - May 31 , 2026 | 03:32 PM
యాదాద్రిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతోపాటు వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో.. యాదాద్రికి భక్తులు క్యూ కట్టారు. హైదరాబాద్తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వేదాద్రికి భక్తులు తరలి వచ్చారు.
1/9
యాదాద్రిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తారు.
2/9
ఆదివారం సెలవు దినం కావడంతోపాటు వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో.. యాదాద్రికి భక్తులు క్యూ కట్టారు.
3/9
హైదరాబాద్తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వేదాద్రికి భక్తులు తరలి వచ్చారు.
4/9
దీంతో స్వామి వారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి.
5/9
ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, శ్రీసత్యనారాయణ స్వామి వారి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరణి తదితర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
6/9
భక్తుల తాడికితో స్వామి వారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
7/9
యాదాద్రి కొండపై వాహనాల పార్కింగ్ నిండిపోయింది. దీంతో వాహనదారులు కొండమీదకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.
8/9
వాహనాలను కొండ కింద పార్క్ చేసి వెళ్తామన్నా.. సరిపడా బస్సులు లేక పోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
9/9
కనీసం సెలవు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. ఈ సమయంలో బస్సులు పెంచాలని దేవస్థానం అధికారులను భక్తులు ప్రశ్నిస్తున్నారు.
Updated at - May 31 , 2026 | 03:42 PM