గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - May 12 , 2026 | 02:39 PM
తిరుపతి తాతయ్య గుంటలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. మంగళవారం (12-05-2026).. ఈ జాతర చివరి రోజు. దీంతో అమ్మ వారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు.
1/12
తిరుపతి తాతయ్య గుంటలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. మంగళవారం (12-05-2026).. ఈ జాతర చివరి రోజు. దీంతో అమ్మ వారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు.
2/12
ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.
3/12
ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పొయ్యిలపై పొంగలి వండి.. అమ్మవారికి నైవేద్యంగా భక్తులు సమర్పించారు.
4/12
అలాగే అమ్మవారికి చీర సారెలు మొక్కుల రూపంలో సమర్పించారు.
5/12
ఈ రోజు అమ్మవారిని దాదాపు లక్ష మంది భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
6/12
ప్రతి ఏటా వైశాఖ మాసం చివరి వారంలో గంగమ్మ జాతర జరుగుతుంది.
7/12
ఈ ఏడాది మే 5వ తేదీన ఈ జాతర ప్రారంభమైంది.
8/12
రోజుకో వేషంతో భక్తుల విచిత్ర అలంకరణలతో గంగమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
9/12
మే 6వ తేదీ బైరాగి వేషంతో ప్రారంభమై.. బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషంతో ఈ జాతర కొనసాగింది.
10/12
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తాతయ్య గుంటలోని గంగమ్మ స్వయానా సోదరిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి టీటీడీ సారె సమర్పించింది.
11/12
పలువురు ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
12/12
చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు అంతా గంగమ్మను దర్శించుకున్నారు.
Updated at - May 13 , 2026 | 07:01 AM