టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ABN, Publish Date - Sep 08 , 2026 | 09:32 PM
తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ ఈరోజు (మంగళవారం) రెండో రోజు నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్చార్జ్లు హాజరయ్యారు.
1/15
తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ ఈరోజు (మంగళవారం) రెండో రోజు నిర్వహించారు.
2/15
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్చార్జ్లు హాజరయ్యారు.
3/15
రెండో రోజు కాంక్లేవ్లో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.
4/15
సుస్థిర అభివృద్ధి, ప్రజాసేవలు, సుపరిపాలన, పొలిటికల్ కమ్యూనికేషన్, ఎల్నినోపై అవగాహన, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలపై టీడీపీ నేతలకు.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
5/15
మంగళవారం సాయంత్రం 6.30 గంటల వరకూ టీడీపీ కార్యాలయంలోనే చంద్రబాబు ఉన్నారు.
6/15
రాష్ట్ర స్థూల అభివృద్ధితో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి అనుసంధానం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు.
7/15
నియోజకవర్గ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, చిలకలూరిపేట, నెల్లూరు సిటీ, తణుకు ముందు ఉన్నాయని సీఎం వివరించారు.
8/15
అభివృద్ధిపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా వారి వద్దకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఓటు వేసే అలవాటు లేని వారిని కూడా మార్చుకుందామని నిర్దేశించారు. విమర్శలను కూడా సానుకూలంగా మార్చుకుని ప్రజల మద్దతు కూడగట్టాలని సీఎం పేర్కొన్నారు.
9/15
మనం చేస్తున్న అభివృద్ధితో ఓటు బ్యాంక్ పెంచుకుందామని మంత్రి నారా లోకేశ్ సూచించారు. మన దగ్గరకు గూగుల్ వస్తే భారత్లోని ఇతర రాష్ట్రాలు అసూయపడ్డాయని తెలిపారు.
10/15
ఏపీలో కొందరు వ్యక్తులు కుట్రలు చేస్తూ దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారని మంత్రి లోకేశ్ విమర్శించారు.
11/15
డేటా సెంటర్లకు కావాల్సిన 5 టీఎంసీల నీరు అసలు సమస్యే కాదని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు దాదాపు 2 టీఎంసీల నీరు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పారు.
12/15
డేటా సెంటర్ల ద్వారా అధికమొత్తంలో ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.
13/15
2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.
14/15
15-20 రంగాల్లో జీఎస్డీపీని పెంచేలా ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.
15/15
రూ.30 వేల కోట్ల పెట్టుబడులను తాము ఆకర్షించామని మంత్రి లోకేశ్ తెలిపారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే అభివృద్ధి మరింతగా సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
Updated at - Sep 08 , 2026 | 09:59 PM