Home » TDP High Command
కూటమి పాలన రెండేళ్ల విజయాలపై ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మొత్తం 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి గొడ్డలి పార్టీ చేతులెత్తేసిందని విమర్శించారు.
మహానాడును వర్చువల్గా అద్భుతంగా నిర్వహించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
మహానాడు వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లిని, చెల్లిని మెడపెట్టి గెంటేశారని ధ్వజమెత్తారు.
విజన్ పాలిటిక్స్కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని... ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు.
తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు.
తెలుగుదేశం పార్టీ ఈసారి నిర్వహించే మహానాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కబోతోందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్లలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుతో అనుసంధానం కాబోతున్నారని పేర్కొన్నారు.
ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.
పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతల్లో ఆ పార్టీ హై కమాండ్ మార్పు చేసింది.