డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్
ABN, Publish Date - Jul 19 , 2026 | 08:14 AM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ నివాసానికి శనివారం సాయంత్రం లోకేశ్ వెళ్లారు.
1/5
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ నివాసానికి శనివారం సాయంత్రం లోకేశ్ వెళ్లారు.
2/5
పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని పవన్కు అందజేశారు. భుజం గాయం, శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై లోకేశ్ ఆరా తీశారు.
3/5
వైద్యులు సూచించిన విశ్రాంతి, జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని సూచించారు. పవన్ త్వరితగతిన పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
4/5
పవన్ కల్యాణ్కు మంత్రి లోకేశ్ ధైర్యం చెప్పారు. ఈ భేటీ ఆప్యాయ వాతావరణంలో జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
5/5
పవన్ కల్యాణ్ ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకోగా, పలువురు రాజకీయ ప్రముకులు, అభిమానులు ఆయనను పరామర్శిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Updated at - Jul 19 , 2026 | 08:17 AM