ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. గవర్నర్ను కలిసి విజయ్
ABN , Publish Date - May 06 , 2026 | 04:05 PM
టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్గేకర్ను బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్భవన్లో కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
చెన్నై: టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్గేకర్ను బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్భవన్లో కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
మే 7న ప్రమాణస్వీకారం
కాగా, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఈనెల 7వ తేదీన విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంచి ముహూర్తం కావడంతో ఉదయం 10 గంటల నుంచి 11.15 గంటల మధ్య విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5,000 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేసి ఉదయం గురువారం 6 గంటల కల్లా సిద్ధం చేయనున్నట్టు టీఎంకే వర్గాలు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం కావడంతో స్టేడియం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
విజయ్కు గవర్నర్ ఆహ్వానం.. ప్రమాణ స్వీకారానికి రాహుల్
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు