Share News

ఆ మూడు షరతులకు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా.. సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన..

ABN , Publish Date - Jul 20 , 2026 | 08:05 AM

కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ (సోమవారం) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు ముందు ప్రముఖ సామాజిక కార్యకర్త సోమన్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. 20 రోజులకు పైగా తాను చేస్తున్న నిరాహార దీక్షను ఈరోజు విరమిస్తానని ఆయన ప్రకటించారు. అయితే, తాను ప్రతిపాదించిన మూడు షరతులు నెరవేరితేనే నిరశన దీక్షను విరమిస్తానని తెలిపారు.

ఆ మూడు షరతులకు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా.. సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన..
Soman Wangchuk Hunger Strike

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ (సోమవారం) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు ముందు ప్రముఖ సామాజిక కార్యకర్త సోమన్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. 20 రోజులకు పైగా తాను చేస్తున్న నిరాహార దీక్షను ఈరోజు విరమిస్తానని ఆయన ప్రకటించారు. అయితే, తాను ప్రతిపాదించిన మూడు డిమాండ్లు నెరవేరిస్తేనే దీక్షను విరమిస్తానని తెలిపారు. ఈ మేరకు మూడు షరతులతో కూడిన లేఖను సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా వాంగ్‌చుక్ పంచుకున్నారు.


కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది తన మొదటి డిమాండ్‌గా వాంగ్‌చుక్ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలోని వైఫల్యాలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై సమాధానం చెప్పాలన్నారు. ప్రశ్నపత్రాల లీక్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని రాజకీయ నాయకులు తనకు హామీ ఇవ్వాలని రెండో షరతు పెట్టారు. మూడో డిమాండ్‌గా ఆరోగ్యం, ఇతర కారణాల వల్ల తాను ఈరోజు పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనలేకపోతే, అగ్ర రాజకీయ నాయకులు తనను ఆస్పత్రిలో పరామర్శించి మిగిలిన రెండు షరతులపై హామీ ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లు నేరవేరిస్తే తాను దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.


కాగా, ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని జూన్ 28 నుంచి వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం నాడు ఆయన దీక్షను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు.. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆస్పత్రి నుంచే ఆయన తన మూడు డిమాండ్లను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరోవైపు నేడు పార్లమెంట్ మార్చ్‌కు సీజేపీ పిలుపునిచ్చింది. ఇప్పటికే వేల మంది విద్యార్థులు, సీజేపీ మద్దతుదారులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. అయితే, పోలీసులు మాత్రం వారి మార్చ్‌కు అనుమతి లేదని చెబుతున్నారు. ఈ మేరకు దేశ రాజధానిలో నేడు పెద్దఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

టైప్‌-2 మధుమేహం ఉంటే డెంగీ ముప్పు అధికం

సమరమే..!

Updated Date - Jul 20 , 2026 | 09:38 AM