'శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్' శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని ప్రశంసలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 08:34 PM
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 'శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్' శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 'శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్' (SRCC) శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 5 (ఉపాధ్యాయుల దినోత్సవం) సాయంత్రం 7 గంటలకు జరిగిన ఈ వేడుకలకు ముందు ప్రధాని సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా కళాశాల అందించిన సేవలను ప్రశంసించారు.
వ్యాపారం, ప్రజాజీవితం, సామాజిక రంగాలలో తరతరాల నాయకులను తీర్చిదిద్దడంలో ఎస్ఆర్సీసీ ఎంతో విశిష్టమైన ముద్ర వేసిందని, విద్యా ప్రతిభ, సంస్థాగత నిర్మాణంలో ఈ కళాశాల ప్రత్యేక గుర్తింపు సాధించిందని ప్రధాని కొనియాడారు.
జెన్ జీ (Gen Z) విద్యార్థులతో ముఖాముఖి
ఉపాధ్యాయుల దినోత్సవం నాడే ఈ శతాబ్ది వేడుకలు జరగడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కళాశాలకు చెందిన 'జెన్ జీ' (Gen Z) విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. యువత తమ ఆలోచనలు, ఆకాంక్షలు, భవిష్యత్ లక్ష్యాలను దేశ ప్రధానితో నేరుగా పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. ఈ వేడుకలకు హాజరుకావడానికి ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించి కాలేజ్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ జర్నీలో మెట్రో రైలులోని చిన్నారులు, మహిళలతో మోదీ ముచ్చటించారు.
శతాబ్దాల విద్యా వారసత్వం
కామర్స్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఎస్ఆర్సీసీని 1926లో ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత సర్ శ్రీరామ్ స్థాపించారు. గడిచిన వంద సంవత్సరాల్లో ఈ కళాశాల ఎందరో మేధావులను, పరిపాలనాధికారులను, పారిశ్రామికవేత్తలను, విధాన నిర్ణేతలను దేశానికి అందించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News