Pariksha Pe Charcha: గిన్నిస్ రికార్డు దిశగా.. 3 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Jan 01 , 2026 | 09:05 AM
పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం పరీక్షాపే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ పాల్గొనే ఈ కార్యక్రమానికి ఈ ఏడాది రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 3 కోట్లు దాటిపోయింది. త్వరలో మరో చారిత్రక రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థులకు మార్గనిర్దేశనం కోసం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రారంభమైన పరీక్షా పే చర్చా కార్యక్రమం మరో గిన్నిస్ రికార్డును నెలకొల్పే దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు. జనవరి 11 వరకూ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్న వారిలో 2.85 కోట్ల మంది విద్యార్థులు, 17 లక్షల మంది టీచర్లు, 3.49 లక్షల మంది తమ పేర్లను ఈ 8వ ఎడిషన్ కార్యక్రమం కోసం ఇప్పటివరకూ రిజిస్టర్ చేసుకున్నారు. డిసెంబర్ 30 నాటికి మూడు కోట్ల పైచిలుకు రిజిస్ట్రేషన్లతో ఈ కార్యక్రమం చారిత్రక మైలురాయిని చేరుకుందని కేంద్ర విద్యాశాఖ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 2025 ఎడిషన్లో 3.53 కోట్ల మంది రిజిస్టర్ చేసుకుని గిన్నిస్ రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే (Pariksha Pe Charcha - Over 3 Cr registered).
2018లో ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎంపికైన విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రధాని నుంచి మార్గనిర్దేశనం పొందొచ్చు. లక్ష్య సాధన, కలల సాకారం దిశగా నిలకడగా ఎలా ముందుకు సాగాలనే విషయంలో ప్రేరణ పొందొచ్చు. ఎగ్జామ్స్ను ఓ వేడుకలా ఎలా ఆస్వాదించాలి, స్వాతంత్ర్య సమరయోధుల సేవలు, పర్యావరణ పరిరక్షణ, క్లీన్ ఇండియా అంశాల నేపథ్యంలో తాజా ఎడిషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
రిజిష్ట్రేషన్ ఇలా..
ముందుగా అభ్యర్థులు innovateindia1.mygov.in వెబ్సైట్ను సందర్శించాలి.
ప్రధాన పేజీలోని పార్టిసిపేట్ నౌ అనే అంశాన్ని ఎంచుకోవాలి
పేరెంట్, టీచర్, స్టూడెంట్ (టీచర్ ద్వారా లాగిన్) లేదా స్టూడెంట్ (సెల్ఫ్ పార్టిసిపేషన్) కేటగిరీలల్లో తగినదాన్ని ఎంచుకున్నాక పార్టిసిపేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి
ఆ తరువాత ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి
ఇవీ చదవండి
ఇండిగోకు 458 కోట్ల జీఎస్టీ ఫైన్