మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన.. బాబాగా మారాలని జననాంగం నరుక్కున్నాడు..
ABN , Publish Date - May 31 , 2026 | 07:52 AM
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ షాకింగ్ చోటుచేసుకుంది. సాధువు కావాలనే కోరికతో ఓ వ్యక్తి తన జననాంగాన్ని కోసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సమస్యలను తట్టుకోలేక బాబాగా మారాలనుకున్న ఓ 42 ఏళ్ల వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ షాకింగ్ చోటుచేసుకుంది. సాధువు కావాలనే కోరికతో ఓ వ్యక్తి తన జననాంగాన్ని కోసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సమస్యలను తట్టుకోలేక బాబాగా మారాలనుకున్న ఓ 42 ఏళ్ల వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గొడ్డలితో తన జననాంగాన్ని నరుక్కుని బావిలోకి విసిరేశాడు. మహారాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది (Sadhu Story).
రైతుగా జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తి కుటుంబ బాధ్యతల నుంచి, పాపభీతి నుంచి విముక్తి పొంది బాబాగా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. తన పాప కర్మలకు జననాంగమే కారణమని భావించి దానిని నరుక్కున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు (Madhya Pradesh News).
అతడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు (Shocking Viral News). అతడి భార్య పక్షవాతం కారణంగా మంచాన పడింది. పెద్ద కూతురి వివాహం జూన్ 25వ తేదీన జరగాల్సి ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల కారణంగా అతడు కొంత కాలంగా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..