Share News

కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం

ABN , Publish Date - May 03 , 2026 | 05:46 PM

కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో మార్పు చేశారు. ఇప్పుడు ఆయన ప్రొఫైల్‌లో 'పొలిట్ బ్యూరో సభ్యుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్స్కిస్ట్)' అని ఉంది.

కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం
Kerlam CM Pinarayi Vijayan

తిరువనంతపురం: కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఆదివారం తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో మార్పు చేశారు. ఇప్పుడు ఆయన ప్రొఫైల్‌లో 'పొలిట్ బ్యూరో సభ్యుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్స్కిస్ట్)' అని ఉంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 4న జరుగనున్న వేళ పినరయి విజయన్ ప్రొఫైల్‌లో మార్పు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


పినరయి విజయన్ వరుసగా మూడోసారి ధర్మదం నియోజకవర్గం నుంచి విజయాన్ని ఆశిస్తున్నారు. ఆయనపై యూడీఎఫ్ అభ్యర్థిగా వీపీ అబ్దుల్ రషీద్, బీజేపీ అభ్యర్థిగా కె.రణ్‌జీత్ పోటీలో ఉన్నారు. 2016, 2021లో వరుసగా ఈ నియోజకవర్గం నుంచి పినరయి గెలుపొందారు..


ఎగ్జిట్ పోల్స్ ఏమి చెప్పాయంటే..

కాగా, ఈసారి కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ గెలస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 140 సీట్లలో 70-80 సీట్లు యూడీఎఫ్ గెలుస్తుందని, ఎల్‌డీఎఫ్‌కు 49-62 సీట్లు రావచ్చని 'యాక్సి మై ఇండియా' ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సైతం యూడీఎఫ్‌కు 75-85, ఎల్‌డీఎఫ్‌కు 52-60 సీట్లు వస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 9న ఒకే విడతలో కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మే 4న ఫలితాలను ప్రకటించనున్నారు.


ఇవి కూడా చదవండి..

ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

Updated Date - May 03 , 2026 | 06:48 PM