Home » Pinarayi Vijayan
'ఇండియా' కూటమిలో మిత్రులు, కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై పినరయి విజయన్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. మీ నాన్నమ్మ కూడా జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.
కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్ కోసం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ రవి రంగంలోకి దిగారు. అతడిని మరణ శిక్ష నుంచి రక్షించేందుకు సాక్షాత్తు సీఎం నడుం బిగించారు. ఆ క్రమంలో అతడిని రక్షించేందుకు నేను సైతం అంటూ ప్రపంచంలోని మలయాళీలంతా కదిలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ , ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.
కేరళ ప్రభుత్వం అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసాధారణ జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని కేరళ సర్కార్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాలను కేరళ సీఎం పినరయి విజయన్ తప్పు పట్టారు.
భారతీయ విద్యార్థి ఫెడరేషన్(SFI) నిరసనకారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శనివారం రోడ్డు పక్కన కూర్చుని నిరసన తెలిపిన తీరు గురించి కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు.
కేవలం 8 బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రెండేళ్ల సమయం కూడా సరిపోలేదా..? గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అసలు ఏం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాసన సభ ఆమోదించిన 8 బిల్లులను గవర్నర్ తొక్కి పెడుతున్నారంటూ కేరళ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Israel-Hamas War: కేరళ సీఎం పినరయి విజయన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన ఆయన.. భారత్ను ఇజ్రాయెల్ ఆయుధంగా వాడుకుంటోందని కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని.. మన భారతదేశ వైఖరిగా పరిగణించొద్దని పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు హత్యా బెదిరింపులు వచ్చాయి. కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. కేరళ సీఎంని చంపేస్తామని చెప్పి..
ఇటీవల జరిగిన ఇస్లామిక్ గ్రూప్ కార్యక్రమంలో ఒక హమాస్ నాయకుడు వర్చువల్ ప్రసంగం చేశాడన్న అంశం కేరళలో వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ అక్కడ నానా రాద్ధంతం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...