Home » Pinarayi Vijayan
కేరళంలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ ఓటమిని చవిచూసినప్పటికీ ధర్మాదం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం మూడోసారి. అయితే గత రెండు పర్యాయాల్లో ఆయన సాధించిన ఆధిక్యం కంటే ఈసారి తగ్గింది.
కేరళం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్తాజా చర్య అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. కౌంటింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ వివరాల్లో 'ముఖ్యమంత్రి' పదాన్ని తొలగించారు. ఆ ప్లేస్లో సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అని చేర్చారు.
కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్దేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో సీఎంలుగా పనిచేసిన కరుణాకరన్, ఊమెన్ చాందీలు కేరళంను ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, రాహుల్ బీజేపీకి 'బీ టీమ్' అని ఆక్షేపించారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. సీపీఎం వెటరన్ నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరు జిల్లా ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారంనాడు నామినేషన్ వేశారు.
కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజే శాసన సభలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశ ప్రారంభ ప్రసంగంలో గవర్నర్ ఆర్వీ.అర్లేకర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని పలు అంశాలను చదవక పోవడంపై కేరళ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
పినరయి విజయన్ తన ప్రసంగంలో భగవద్గీత శ్లోకాలను ఉంటకించారు. నిజమైన భక్తులు రాగద్వేషాలకు అతీతమని, సుఖదుఖాలతో సమత్వం కలిగి ఉంటారని అన్నారు. శబరిమల కుల, మతాలకు అతీతమని, అన్ని మతవిశ్వాస వారు ఈ యాత్రను చేపడతుంటారని చెప్పారు.
భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ అవతరించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ సెంట్రల్ స్టేడియంలో ఈ మేరకు ప్రకటించారు.
కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.
కేరళలోని వయనాడ్లో(Wayanad landslide) కొండచరియలు విరిగిపడిన తరువాత, సాయుధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ప్రభుత్వ యంత్రాంగంతో కూడిన ప్రధాన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.