రామమందిర దోపిడీకి ముందే.. 1983లో కాశీ ఆలయంలో ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:38 AM
ఆలయంలో దోపిడీ అంటే నగదు, బంగారం, వజ్రాలను చోరీ చేయడం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా దోచుకోవడం. ఇటీవల అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆలయంలో దోపిడీ అంటే నగదు, బంగారం, వజ్రాలను చోరీ చేయడం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా దోచుకోవడం. ఇటీవల అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం కేసు నేపథ్యంలో, గతంలో జరిగిన కాశీ విశ్వనాథుడి ఆలయ దోపిడీ ఘటన మళ్లీ చర్చనీయాంశమైంది (Kashi Vishwanath theft 1983).
నాలుగు దశాబ్దాల క్రితం, కాశీ విశ్వనాథ ఆలయంలో జరిగిన ఒక దొంగతనం కారణంగా దాని నిర్వహణను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవలసి వచ్చింది. 1983 జనవరిలో, కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో శివలింగం చుట్టూ ఉన్న 2.6 కిలోల బంగారు ఆభరణాలు, దాదాపు 9 కిలోల వెండి చోరీకి గురయ్యాయి. ఈ చోరీకి పాల్పడిన 11 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా ఆలయంలో పని చేసే వారి సహాయంతోనే దోపిడీ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు (Ayodhya Ram Temple theft).
ఈ ఘటన అనంతరం కాశీ విశ్వనాథ ఆలయ భద్రత, ఆర్థిక నిర్వహణలో లోపాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఆలయ నిర్వహణను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు ఆధీనంలోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి భద్రతా వ్యవస్థలు, విరాళాల లెక్కింపు, పరిపాలనలో పలు సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. అయోధ్య రామమందిర విషయంలో కూడా ప్రభుత్వం నూతన సంస్కరణలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు (Ram Mandir donation controversy).
కాగా, రామ మందిర ఆలయ ట్రస్టుకు జవాబుదారీగా ఉండే సీఈవో నియామకానికి తాము అంగీకరిస్తామని, అయితే ప్రభుత్వ స్వాధీనాన్ని మాత్రం అనుమతించబోమని వీహెచ్పీ తెలిపింది (Ayodhya temple news). శ్రీ రామ్ జన్మభూమి ఆలయాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చే ఏ ప్రయత్నాన్నైనా తాము వ్యతిరేకిస్తామని వీహెచ్పీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రంలో గాలింపు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..