Share News

భోగాపురానికి గుడ్ న్యూస్

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:57 PM

భోగాపురం ఎయిర్ పోర్ట్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సంబంధిత పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 4న భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.

భోగాపురానికి గుడ్ న్యూస్
Civil Aviation Minister Ram Mohan Naidu

న్యూఢిల్లీ, జనవరి 27: బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ భారత్‌లో విమానాల తయారీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. అందుకోసం అదానీ, ఎంబ్రాయర్‌ల మధ్య కీలక సహకార ఒప్పందం(Collaboration Agreement) కుదిరింది. ఈ ఒప్పందంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో తయారీ యూనిట్‌లను ఈ ఎంబ్రాయర్ సంస్థ నెలకొల్పనుంది.

దీంతో భోగాపురంలో ఎంబ్రాయర్‌ చేత యూనిట్ ఏర్పాటు చేయించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. భూమితో పాటు మౌలిక సదుపాయాలనూ కల్పిస్తామని ఎంబ్రాయర్‌కు ఏపీ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భోగాపురంలో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్(ఎంఆర్‌ఓ), ఏరోస్పేస్ క్లస్టర్లను సైతం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బ్రెజిల్‌కు చెందిన ఈ ఎంబ్రాయర్.. చిన్న, మధ్యస్థ ప్యాసింజర్ విమానాలతో పాటు సైనిక, ట్రాన్స్‌పోర్ట్ విమానాలనూ తయారు చేస్తోంది.


మరోవైపు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 4న ఈ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్‌ సహా పలువురు ఉన్నతాధికారులు భోగాపురం ఎయిర్‌పోర్టు‌కు చేరుకున్నారు.


ఈ సందర్భంగా వీరికి జిల్లా ఉన్నతాధికారులతో పాటు విమానయాన సంస్థ అధికారులు నాడు ఘన స్వాగతం పలికారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ఎయిర్‌పోర్ట్ పూర్తయిందని జీఎంఆర్ సంస్థ వెల్లడించింది. జూన్ 26న ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అఖిలపక్ష భేటీ

For More National News And Telugu News

Updated Date - Jan 27 , 2026 | 02:57 PM