17 నుంచి బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:04 AM
గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా ప్రభుత్వంలో నిరాటంకంగా పాతికేళ్లుగా ప్రధాని మోదీ కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు...
మోదీ 25ఏళ్ల ప్రస్థానంపై నెలపాటు దేశవ్యాప్త
కార్యక్రమాలు..బీజేపీ అధ్యక్షుడు నబీన్ ప్రకటన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా ప్రభుత్వంలో నిరాటంకంగా పాతికేళ్లుగా ప్రధాని మోదీ కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఆయన పుట్టినరోజైన ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజులపాటు వివిధ కార్యక్రమాలతో యువతకు చేరువవడం దీని ఉద్దేశంగా కనిపిస్తోంది. 2001 అక్టోబరు 7 నుంచి 2014 మే 22 వరకు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2014 మే 26 నుంచి ఆయన ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ జన్మదినమైన 17వ తేదీని ‘సేవాదివ్స’గా జరుపనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. ఆరోజు దేశమంతటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఆ రోజు సాయంత్రం ‘ఆశీర్వాద్ కా దియా(ఆశీర్వాద దీపం)’ కార్యక్రమం ఉంటుందని.. మోదీ పాతికేళ్ల ప్రజాజీవితాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు దీపాలు వెలిగిస్తారని తెలిపారు. అక్టోబరు 7తో ఆయన ప్రజాజీవితంలోకి వచ్చి పాతికేళ్లు పూర్తవుతాయని..‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఆ రోజు చివరి, ప్రధాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News