Share News

యూకే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వీసా తప్పనిసరి

ABN , Publish Date - Feb 26 , 2026 | 08:12 PM

యూకేలో కొత్త డిజిటల్ ఈ-వీసా విధానం బుధవారం నుండి అమల్లోకి వచ్చింది. ఇకపై సంప్రదాయ వీసా స్థానంలో ఈ-వీసాలను అందుబాటులోకి తెచ్చారు.

యూకే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వీసా తప్పనిసరి
UK Digital Visa

ఇంటర్నెట్ డెస్క్: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ వీసా విధానం బుధవారం నుండి అమల్లోకి వచ్చింది. సంప్రదాయ పేపర్ వీసాల స్థానంలో ఈ-వీసాలను ప్రవేశపెట్టడంతో, విదేశీ ప్రయాణికులు ముఖ్యంగా భారతదేశం నుంచి వెళ్లేవారు ఇకపై డిజిటల్ వీసా ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. యూకే సరిహద్దు, ఇమిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించేందుకు యుకే వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ ఆధ్వర్యంలో ఈ కొత్త ఈ-వీసా విధానాన్ని అమలు చేశారు. ఈ విధానంలో సంప్రదాయంగా పాస్‌పోర్టుపై అతికించే వీసా స్టిక్కర్లకు బదులుగా పూర్తిగా డిజిటల్ రూపంలో వీసాను జారీ చేస్తారు.


ఈ డిజిటల్ వీసాలో ప్రత్యేకమైన షేర్ కోడ్ ఉంటుంది. ఉద్యోగ సంస్థలు, యజమానులు తదితరులతో దీన్ని పంచుకునే అవకాశం కల్పించారు. డిజిటల్ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ, వీసా దరఖాస్తుదారులు బయోమెట్రిక్ వివరాల నమోదు కోసం వీసా దరఖాస్తు కేంద్రానికి తప్పనిసరిగా వెళ్లాల్సిందే.. అయితే, దరఖాస్తు ప్రక్రియలో భాగంగా పాస్‌పోర్టును అక్కడే వదిలి వెళ్లాల్సిన అవసరం ఉండదు.


ఈ-వీసా డిజిటల్ రూపంలో ఉండటం వల్ల వీసా పోగొట్టుకోవడం, దొంగిలించడం లేదా నకిలీ చేయడం వంటి సమస్యలు ఉండవని అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో ఈ-వీసా లేదా సంబంధిత వివరాలు అందుబాటులో లేకపోతే విమానయాన సంస్థలు ప్రయాణాన్ని నిరాకరించే అవకాశం కూడా ఉంటుంది. యుకే ప్రభుత్వం ప్రకారం, ఈ కొత్త విధానం ద్వారా ఇమిగ్రేషన్ వ్యవస్థ మరింత సురక్షితంగా, వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?

పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

For More Latest News

Updated Date - Feb 26 , 2026 | 08:19 PM